Wednesday, March 12, 2025
Homeఆంధ్రప్రదేశ్IAS: ఇక జిల్లాకో ప్రత్యేక అధికారి.. సరికొత్త పాలనా వ్యవస్థకు సీఎం చంద్రబాబు శ్రీకారం

IAS: ఇక జిల్లాకో ప్రత్యేక అధికారి.. సరికొత్త పాలనా వ్యవస్థకు సీఎం చంద్రబాబు శ్రీకారం

రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతా కార్యక్రమాల్ని సమర్థంగా అమలు చేసేందుకు, పరిపాలనను బలోపేతం చేసేందుకు, వివిధ శాఖల మధ్య సమన్వయంతో సమస్యల సత్వర పరిష్కారానికి, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని26 జిల్లాలకు ఇన్ఛార్జులుగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారులను జోనల్ ఇన్చార్జులుగా నియమించింది.

- Advertisement -

జిల్లా ఇన్ఛార్జులుగా నియమించిన అధికారుల బాధ్యతలు
ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో పాల్గొని జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులకు సహాయకారిగా ఉండాలి.
15 రోజులకోసారి జిల్లా అధికారులతో సమీక్ష సమా వేశాలు నిర్వహించాలి. గ్రామాల్లో పర్యటించాలి. నెలకు కనీసం రెండుసార్లు గ్రామాల్లో రాత్రి బస చేయాలి. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్షించాలి. తగు చర్యలు చేపట్టాలి. నెలవారీ పురోగతి నివేదికను జోనల్ ఇన్ఛార్జి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించాలి.

జోనల్ ఇన్ఛార్జుల బాధ్యతలు
ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలకు వ్యూహాత్మక మార్గదర్శకత్వం అందించాలి. నెలవారీ సమీక్షలు నిర్వహించాలి. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల్లో పాల్గొనాలి. (ఉదా: ప్రతి నెల 1న పింఛన్ల పంపిణీ. ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంద్ర) నెలకోసారి గ్రామాలను సందర్శించి అక్కడ రాత్రి బస చేయాలి.

పారిశ్రామికవేత్తలు, రైతులు, లబ్దిదారులు, ప్రజాప్రతి నిధులు, పన్ను చెల్లింపుదారులతో చర్చలు నిర్వహించాలి. జిల్లా కలెక్టర్లు, కీలక అధికారులకు పరిపాలనా సంబంధిత శిక్షణ అందించాలి.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార స్థితిని సమీక్షించాలి. ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో అవాంతరాలను గుర్తించి, జాప్యానికి కారణాలను విశ్లేషించాలి. ముఖ్యమైన ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, వ్యయాన్ని సమీక్షించాలి. జిల్లా పురోగతి, సమస్యలు, సిఫారసులను ముఖ్య కార్యదర్శికి నివేదించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News