సోషల్ మీడియాలో సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy)పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు పోస్టు చేసిన వ్యవహారంలో జర్నలిస్టు రేవతి, తన్వి యాదవ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ప్రతి సోమ, మంగళవారం విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.
‘నిప్పు కోడి’ అనే ఎక్స్ హ్యాండిల్ ద్వారా సీఎంను తిడుతున్న వీడియో వైరల్గా మారిందని కాంగ్రెస్ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి కైలాశ్ తమకు ఫిర్యాదు చేశారు. ఇందులో పల్స్ టీవీకి చెందిన రిపోర్టర్ గుర్తు తెలియని వ్యక్తిని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడిన వ్యక్తి ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పల్స్ టీవీ ఉద్దేశపూర్వకంగా అతడితో ఈ వ్యాఖ్యలు చేయించిందని విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాఫ్తులో భాగంగా పల్స్ టీవీ ఛానల్ సీఈవో, జర్నలిస్టు రేవతితో పాటు ఛానల్ ప్రతినిధి సంధ్య అలియాస్ తన్వి యాదవ్ను అరెస్టు చేశారు.