Tuesday, March 18, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆన్ లైన్ మెకానిజంతో ప్రైవేట్ స్కూల్ టీచర్ల సమస్యలు పరిష్కరిస్తాం: శాసనసభలో మంత్రి నారా లోకేష్

ఆన్ లైన్ మెకానిజంతో ప్రైవేట్ స్కూల్ టీచర్ల సమస్యలు పరిష్కరిస్తాం: శాసనసభలో మంత్రి నారా లోకేష్

ప్రైవేట్ స్కూల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి ఆన్ లైన్ మెకానిజం ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Lokesh) చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఆటస్థలాలు, అగ్నిమాపక భద్రతా పరికరాల ఏర్పాటుకు గల నిబంధనలు, ప్రైవేటు స్కూల్ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, పాఠశాలల్లో ఎన్ సిసి అభివృద్ధికి చేపడుతున్న చర్యలపై పంతం వెంకటేశ్వరరావు (నానాజీ ) (కాకినాడ రూరల్), వాల్మీకి పార్థసారధి (ఆదోని) అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ… ప్రైవేటు స్కూళ్ల అనుమతులకు సంబంధించి ఫైర్ ఎన్ ఓసిని అగ్నిమాపకశాఖ, బిల్డింగ్ పర్మిషన్స్ పంచాయతీ, లోకల్ బాడీస్ ఇస్తాయి.

- Advertisement -

జిఓ 88 ప్రకారం అడ్మిషన్లను బట్టి ఎంత ఆటస్థలం ఉండాలనే విషయమై నిబంధనలు ఉన్నాయి. ఈ జిఓ ప్రకారం సరిపడనంత ఆటస్థలం లేకపోతే మున్సిపల్ గ్రౌండ్స్ తో టైఅప్ కావచ్చు, అది కూడా అందుబాటులో లేకపోతే వేరే స్కూళ్లతో టై అప్ కావచ్చని ఉంది. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన జిఓతో ఈ వెసలుబాటు కల్పించారు. ప్రైవేటు స్కూళ్ల పర్మిషన్ల విషయంలో కొన్ని లోటుపాట్లు ఉన్నట్లు నా దృష్టికి వచ్చాయి. ఇందుకు ట్రాన్సపరెంట్ మెకానిజిం ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. ఎన్ సిసికి సంబంధించి రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి డైరక్టరేట్ ఏర్పాటుచేయాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు.

ఆటస్థలాల విషయంలో మార్పులు, చేర్పులు చేయాలంటే జిఓ 88 సవరణ తీసుకురావాల్సి ఉంది. 50శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజిల్లో చదువుతున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని అనేక సంస్కరణలు చేపట్టాం. విద్యార్థుల మానసిక వికాసానికి ఫిజికల్ ఎడ్యుకేషన్ కీలకపాత్ర వహిస్తుంది. విద్యార్థుల సంఖ్యను బట్టి పిఇటిలను నియమించే విషయమై సమీక్షిస్తున్నాం.

క్రీడాస్థలాల విషయంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ప్రైవేటు స్కూల్ టీచర్ల జీతాల విషయమై ప్రైవేటు యజమానులతో సమావేశం కాగా, కొన్ని పత్రాలు ఇచ్చేందుకు ప్రైవేటు టీచర్లు నిరాకరిస్తున్నట్లు తమ దృష్టికి తెచ్చారు. ఏదేమైనా నిబంధనలు ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే. వచ్చే వారం ప్రైవేటు టీచర్లతో అధికారులు ప్రైవేటు టీచర్లతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకోనున్నట్లు మంత్రి లోకేష్ చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News