తెలంగాణ బడ్జెట్(Telangana Budget) ప్రసంగంలో ఆర్థికమంత్రి భట్టి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకే పెద్ద పీట వేస్తున్నామని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం కింద బస్సులో ఉచిత ప్రయాణానికి రూ.5,005 కోట్లు ఆదా అయినట్లు ప్రకటించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి రూ.433 కోట్లు ఇచ్చామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు కూడా మహిళల పేరు మీదే ఇవ్వాలని నిర్ణయించినట్లు భట్టి తెలిపారు. మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు.
విద్యార్థులకు భట్టి భారీ శుభవార్త
2025-26 వార్షిక బడ్జెట్ను ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ పద్దులో విద్యార్థులకు భట్టి గుడ్ న్యూస్ తెలిపారు. విద్యా రంగానికి రూ.23,108 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో IIT-JEE, NEET కోచింగ్తో పాటు ఉచిత వసతులు కల్పించబోతున్నామన్నారు.
డైట్ & కాస్మోటిక్స్ ఛార్జీలు పెంపు
గురుకులాల్లో డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంచుతామన్నారు. పాఠశాలల్లో గ్రీన్ ఎనర్జీ కోసం సౌర విద్యుత్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. విద్యార్థుల కడుపు నిండా ఉచితంగా సాయంత్రం వేళ స్నాక్స్ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా ప్రకటించారు. ఇక సంక్షేమ వసతి గృహాల్లో ‘కామన్ డైట్’ స్కీం అమలు చేయబోతున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో తెలిపారు.
Telangana Budget: తెలంగాణ బడ్జెట్లో మహిళలకే పెద్దపీట
- Advertisement -