Thursday, September 19, 2024
HomeతెలంగాణThangallapalli: ఖబర్దార్ రేవంత్ రెడ్డి

Thangallapalli: ఖబర్దార్ రేవంత్ రెడ్డి

కేసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తే ఊరుకునేది లేదంటు హెచ్చరించారు జిల్లా సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు మాట్ల మధు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మధు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కామారెడ్డి లో జరుగుతున్న యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాట్ల మధు ఖబర్దార్ రేవంత్ రెడ్డి అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామ సర్పంచ్ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పాత్రికేయుల నమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.. టి.ఎస్.పి.ఎస్.సి అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ అని టి.ఎస్.పి.ఎస్.సి కి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రభుత్వం దీనిపై ఎలాంటి అజమాయిషీ చేయదని, సాక్షాత్తు మాజీ మొదటి చైర్మన్ తటస్థుడైనా మేధావి ఘంటా చక్రపాణి ప్రభుత్వానికి టి.ఎస్.పి.ఎస్.సి పై ఎలాంటి అజమాయిషీ ఉండదని దాంట్లో జరిగిన తప్పులకు కమిషన్ మాత్రమే బాధ్యత వహిస్తుందని తెలిపారు.

- Advertisement -

ఈ విషయంలో అనవసర రాద్దాంతం చేస్తూ రాజకీయం చేయాలని చూస్తే బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అవసరమైతే భౌతిక దాడులకు కూడా వెనుకాడభోమని ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని వెల్లడించారు. పోలీస్ అధికారులకు ముందస్తు మనవి చేశారు. నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేస్తే, అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏ పార్టీ నాయకులను కూడా వదిలిపెట్టభోమని, వారి చర్యలలో శాంతి భద్రతలకు కూడా భంగం వాటిళ్లితే కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. ఈ ప్రెస్ మీట్ లో భీఆర్ఎస్ నాయకులు సురభి నవీన్ రావు, కొయ్యడా రమేష్, మసిరెడ్డి అవినాష్ రెడ్డి, చిలివేరి చిరంజీవి, బూర యాదగిరి, బోళావేని ఎల్లం, నల్లగొండ ప్రవీణ్, పొన్నాల చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News