గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి(Vallabhaneni Vamsi) భారీ షాక్ తగిలింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను విజయవాడ కోర్టు డిస్మిస్ చేసింది. దీంతో వంశీకి తీవ్ర నిరాశ ఎదురైంది.
- Advertisement -
కాగా గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 71వ నిందితుడిగా ఉన్న వంశీని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుతో పాటు మరిన్ని కూడా ఆయనపై నమోదు అయ్యాయి. దాదాపు 40 రోజులుగా వంశీ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బెయిల్ కోసం దరఖాస్తు చేయగా ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు నిర్ణయంతో మరికొన్ని రోజులు ఆయన జైలులో ఉండక తప్పదు.