Friday, September 20, 2024
HomeతెలంగాణHyd: serp ఉద్యోగులకు కొత్త పే స్కేల్

Hyd: serp ఉద్యోగులకు కొత్త పే స్కేల్

Serp ఉద్యోగులలో కలిసి సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దేవరుప్పుల, జనగామ జిల్లాలో మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళ సాధికారత కోసం పాటుపడగా, అందులో serp ఉద్యోగులు చేసిన కృషి ఎంతో ఉందని, వారికి పేస్కేల్‌ ఇవ్వడం కోసం జీఓ 11 విడుదల చేశారు.
ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, దాదాపు 25 ఏళ్లుగా serp ఉద్యోగులు ఎదురుచూస్తున్న పే స్కేల్ పెంచే ప్రయత్నం ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. మనసున్న మహారాజు సీఎం కెసిఆర్ మాత్రమే ఆ సాహసం చేశారని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 3,794 మంది సెర్ప్‌ ఉద్యోగులకు భధ్రత కల్పిస్తూ, కొత్త పేస్కేల్‌ సీఎం కెసిఆర్ ఇవ్వడంలో మంత్రులు కెటీఆర్, హరీష్‌రావు తోడ్పాటు అందించారని వెల్లడించారు. త్వరలో ఐకెపి వీఓఎలకు సముచిత న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో సెర్ప్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్‌రెడి, రాష్ట్ర కన్వీనర్‌ ఏపూరి సోమయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు సుభాష్, రామయ్య, నర్సప్ప, రాజప్ప, జనగామ జిల్లా అధ్యక్షుడు సూత్రపు సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News