కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి(Virupaksha)పై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరిలో నిర్వహించిన సీతారాముల కళ్యాణంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాళిని తాకి ఇవ్వమని ఎమ్మెల్యేకి పండితులు అందజేశారు. అయితే తాళిని అందుకున్న ఎమ్మెల్యే స్వయంగా సీతమ్మ మెడలో కట్టేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఎమ్మెల్యేపై హిందూ సంఘాలు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీతమ్మకు తాళి కట్టడంపై విమర్శలు రావడంతో ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పారు. ఈమేరకు ఓ వీడియో విడుదల చేశారు. పండితులు కట్టమంటేనే సీతమ్మ మెడలో తాళి వేశానని తెలిపారు. దేవుళ్లపై తనకు ఎంతో భక్తి,, విశ్వాసం ఉన్నాయని చెప్పారు. గత 15 ఏళ్లుగా అయ్యప్ప మాల కూడా వేస్తున్నానని తెలిపారు. హిందూవుల మనోభావాలు దెబ్బతిని ఉంటే వారికి క్షమాపణలు చెబుతున్నానని వెల్లడించారు.