ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీతో బిజీగా ఉన్న భారత ఆటగాళ్లు త్వరలోనే టీమిండియా జెర్సీ వేసుకోనున్నారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా(Team India) ఇంగ్లండ్లో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. జూన్ 20న ప్రారంభమయ్యే ఈ సిరీస్ జులై 4న ముగియనుంది. ఈ సిరీస్ తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20ల మ్యాచ్లు ఆడనుంది. ఈమేరకు బీసీసీఐ(BCCI) షెడ్యూల్ను ప్రకటించింది.
- Advertisement -
వన్డే సిరీస్ షెడ్యూల్..
తొలి వన్డే- ఆగస్టు 17 (మిర్పూర్)
రెండో వన్డే- ఆగస్టు 20 (మిర్పూర్)
మూడో వన్డే- ఆగస్టు 23 (చట్టోగ్రామ్)
టీ20 సిరీస్ షెడ్యూల్..
తొలి టీ20- ఆగస్టు 26 (చట్టోగ్రామ్)
రెండో టీ20- ఆగస్టు 29 (మిర్పూర్)
మూడో టీ20- ఆగస్టు 31 (మిర్పూర్)