తెలంగాణ ఇంటర్ ఫలితాల(Inter Results) తేదీని ఇంటర్మీడియట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నారని తెలిపింది. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య, పలువురు అధికారులు పాల్గొననున్నారు. పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.inలో చెక్ చేసుకోవచ్చు.
కాగా రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ పరీక్షలు మార్చి 5 నుంచి 25వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తికావడంతో ఫలితాల విడుదల తేదీని ప్రకటించారు.