Saturday, April 12, 2025
Homeనేరాలు-ఘోరాలుManchiryala: న్యాయవాదులపై దాడులు చేస్తే ఊరుకోం

Manchiryala: న్యాయవాదులపై దాడులు చేస్తే ఊరుకోం

రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న న్యాయవాదిపై దాడి ఘటనకు నిరసనగా మంచిర్యాల జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో మంచిర్యాల న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు భుజంగరావు సుంకర మాట్లాడుతూ… రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న న్యాయవాదిపై దాడి ఘటన చాలా బాధాకరం అన్నారు. దాడి చేసిన వ్యక్తులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని, న్యాయవాదులపై దాడులు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తుల ఆంజనేయులు, అనిల్ రాజ్, ప్రదీప్ చంద్ర, కనకయ్య, భీమ రంజిత్, నటేశ్వరరావు, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News