ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB vs CSK) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధిస్తే ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమైనట్లే. ఇక చెన్నై ప్లేఆఫ్స్ రేసు నిష్ర్కమించిన సంగతి తెలిసిందే. అయినప్పటికి ఆర్సీబీపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉండటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
గత రెండు రోజులుగా బెంగళూరులో వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం.. శనివారం మధ్యాహ్నం లేదా సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక డ్రెనేజ్ సిస్టమ్ అందుబాటులో ఉంది. వర్షం ఆగిన తరువాత కేవలం అరగంట నుంచి గంట వ్యవధిలో మైదానాన్ని మ్యాచ్కు సిద్ధం చేయొచ్చు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు ఒక్కొ పాయింట్ను కేటాయిస్తారు. అప్పుడు ఆర్సీబీ 15 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరుకుంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.