పహల్గామ్ దాడికి ప్రతీకారం భారత్ ‘ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor)పేరుతో పాకిస్థాన్పై భీకర దాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ తమపై దాడి చేస్తే ఎదురుదాడికి దిగుతామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాక్.. ఇండియన్ ఆర్మీ దాడులను తట్టుకోలేక కాళ్లబేరానికి వచ్చింది. ఈ క్రమంలో ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగమంత్రి ఇషాక్ దార్(Ishaq Dar) భారత్ ముందు ఓ కీలక ప్రతిపాదన పెట్టారు. తమ దేశంపై భారత్ దాడులు ఆపితే.. తాము కూడా ఆపుతాం అని రాజీకి వచ్చారు. ఇదే విషయాన్ని అమెరికాకు కూడా స్పష్టం చేశామని వెల్లడించారు.
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నడుమ పాక్ ఆర్మీ చీఫ్కు ఆమెరికా విదేశాంగ మంత్రి రుబియా ఫోన్ చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో పాక్ విదేశాంగశాఖ మంత్రి ఇలాంటి ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పాక్ వక్రబుద్ధి నేపథ్యంలో సరిహద్దుల్లో కాల్పులును కొనసాగిస్తుందా.? లేక ఆపుతుందా..? అని తేలాల్సి ఉంది.