Saturday, May 10, 2025
Homeఇంటర్నేషనల్Trump: భారత్-పాక్ యుద్ధం ముగిసింది.. ట్రంప్ సంచలన ప్రకటన

Trump: భారత్-పాక్ యుద్ధం ముగిసింది.. ట్రంప్ సంచలన ప్రకటన

భారత్- పాకిస్తాన్ దేశాల(India-Pakistan War)మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధాన్ని ఆపేందుకు అమెరికాతో సహా జీ7 దేశాలు ముందుకొచ్చాయి. ఇప్పటికే అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శులతో చర్చించారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయని స్వయంగా తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

- Advertisement -

రెండు దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని.. తమ ప్రతిపాదనలను రెండు దేశాలు గౌరవించాయని పేర్కొన్నారు. తక్షణమే సీజ్‌ఫైర్‌కు భారత్-పాక్ అంగీకరించాయని స్పష్టం చేశారు. దీంతో రెండు దేశాలకు ట్రంప్ అభినందనలతో యుద్ధం ఆపడానికి సహకరించినందుకు కృతజ్ఞతలు చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News