Thursday, May 29, 2025
HomeతెలంగాణFish Prasadam: చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లపై డీసీపీ సమీక్ష

Fish Prasadam: చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లపై డీసీపీ సమీక్ష

ప్రతి ఏడాది మృగశీర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసారం(Fish Prasadam) పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. బత్తిని కుటుంబ సభ్యులు గత 178 సంవత్సరాలుగా దీనిని కొనసాగిస్తున్నారు. ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యల నుంచి ఈ చేప ప్రసాదం ఉపశమనం కలిగిస్తుందని విశ్వసిస్తారు. దీని కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు నగరానికి తరలివస్తారు. బత్తిని కుటుంబం ఈ ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేస్తుంది.

- Advertisement -

ఈ సంవత్సరం చేప ప్రసాదం పంపిణీ చేసే తేదీలు ఖరారయ్యాయి. మృగశీర కార్తె సందర్భంగా జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం అందించనున్నట్లు బత్తిని వంశస్థులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం 5 నుంచి 6 లక్షల మంది వస్తారని ప్రభుత్వానికి తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై 21శాఖల అధికారులతో సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి సమీక్ష నిర్వహించారు. నిర్వాహకులు, ఎగ్జిబిషన్ సొసైటీ, ఎన్జీవోలు ఇతర శాఖల అధికారులతో చర్చించారు. చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని అందరూ సమన్వయంతో పూర్తి చేయాలని డీసీపీ ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News