Monday, June 16, 2025
HomeతెలంగాణKavitha: జూన్ 2న కవిత కొత్త పార్టీ ప్రకటన.. రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

Kavitha: జూన్ 2న కవిత కొత్త పార్టీ ప్రకటన.. రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆయన కుమార్తె కవిత(Kavitha) రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ లేఖపై ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 2న కవిత కొత్త పార్టీని ప్రకటించబోతున్నారని జోస్యం చెప్పారు. అనంతరం తెలంగాణ వ్యాప్తంగా వైఎస్ షర్మిల మాదిరి పాదయాత్ర కూడా చేపడతారని తెలిపారు.

- Advertisement -

కవిత గెలిచినప్పుడు కేసీఆర్‌ దేవుడయ్యారని.. మరి ఇప్పుడు దెయ్యం ఎలా అయ్యారంటూ సందేహం వ్యక్తం చేశారు. దెయ్యాల మధ్య పదేళ్ల రాజకీయం ఎందుకు? చేసినట్లు అంటూ విమర్శించారు. కవిత వద్దకు కేసీఆర్ మధ్యవర్తులను పంపించారని… తండ్రీకూతుళ్ల మధ్య మధ్యవర్తులు ఎందుకని రఘునందన్ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News