దేశంలోని వివిధ రాష్ట్రాల హైకోర్టులకు చెందిన 21 మంది జడ్జిల బదిలీకి సుప్రీంకోర్టు(Supreme court) కొలీజియం సిఫారసు చేసింది. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఏపీ హైకోర్టుకు, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుమలత తెలంగాణ హైకోర్టుకు, కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ లలిత కన్నెగంటి తెలంగాణ హైకోర్టుకు, పట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ అభిషేక్రెడ్డి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం పేర్కొంది.

