Saturday, October 5, 2024
HomeతెలంగాణKCR: తక్షణం ఎకరాకు 10,000, పరిహారం కాదు పునరావాసం

KCR: తక్షణం ఎకరాకు 10,000, పరిహారం కాదు పునరావాసం

అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను ముందుగా ఎరియల్ వ్యూ ద్వారా, తర్వాత స్వయంగా పరిశీలించారు సీఎం కెసిఆర్.  మహబూబాబాద్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం, పెద్ద వంగర మండలంలోని రెడ్డి కుంట తండా, పోచారం, వడ్డే కొత్తపల్లి, బొమ్మకల్ రెవిన్యూ గ్రామాల్లో నష్టపోయిన పంటలను సిఎం కెసిఆర్ పరిశీలించారు. 

- Advertisement -

పంటల నష్టాలపై సంబంధిత రైతులతో మాట్లాడిన సిఎం కెసిఆర్ తో.. వాన పడిన కొద్ది గంటల్లోనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి, రైతులను ఓదార్చినట్లు అన్నదాతలు వివరించటం హైలైట్. 

పంట నష్టాల అంచనాలను అధికారులు, రైతులతో పాటు సిఎం కెసిఆర్ కు వివరించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అక్కడే పౌర సంబంధాలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన, ఫోటో ఎగ్జిబిషన్ ను చూశారు సిఎం కెసిఆర్.

పంటల నష్టాలకు ఎక్కడైనా రూ.3 వేలే ఇస్తారని, తాను హైదరాబాద్ నుండే ఈ ప్రకటన చేయవచ్చని కానీ.. ను స్వయంగా పంటల నష్టాలు చూడాలనుకుని వచ్చినట్టు కేసీఆర్ వెల్లడించారు. రైతులతో స్వయంగా మాట్లాడి, ఓదార్చాలని వచ్చినట్టు సీఎం వివరించారు.

పంటలు నష్ట పోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తున్నట్టు తెలిపిన ఆయన.. నేను వ్యవసాయం చేస్తానని సగర్వంగా వెల్లడించారు.  మంత్రి నిరంజన్ రెడ్డి, దయాకర్ రావులు కూడా వ్యవసాయం చేస్తున్నారని గుర్తుచేశారు. కౌలుకు తీసుకున్న రైతులను కూడా ఆదుకోవాలని,  ప్రభుత్వం తప్పకుండా వారికి కూడా అండగా ఉంటుందని వెల్లడించటం హైలైట్. రైతులే కౌలుదారులను ఆదుకునే విధంగా కలెక్టర్లు వ్యవహరించాలన్నారు.  కలెక్టర్లు రైతులను, కౌలు రైతులను పిలిచి మాట్లడతారని, రైతులు పొందే పరిహారంలోనే ఎంతో కొంత కౌలు రైతులకు కూడా అందే విధంగా చూస్తే బాగుంటుందన్నారు. 

రైతులకు ఇచ్చేది సహాయం కాదు.. పునరావాసమన్నారు సీఎం. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే డి.ఎస్. రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, సిఎం ఓఎస్డీ స్మితా సబర్వాల్, వ్యవసాయశాఖ కమిషనర్ రఘునందన్ రావు, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక్, అడిషన్ కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు, రైతులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News