Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభVarasudu : దిల్ రాజుకి మరో షాక్.. వరుస వివాదాల్లో వారసుడు..

Varasudu : దిల్ రాజుకి మరో షాక్.. వరుస వివాదాల్లో వారసుడు..

- Advertisement -

Varasudu : తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా వరిసు. తమిళ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో వారసుడిగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్టు దిల్ రాజు ప్రకటించాడు.

అయితే ఈ సినిమా మొదటినుంచి వివాదాల్లో చిక్కుకుంటుంది. మొదట షూటింగ్ టైంలో తెలుగు షూట్స్ ఆగినప్పుడు తమిళ్ సినిమా అని షూట్ ఆపలేదు దిల్ రాజు. ఆ టైంలో చాలామంది టాలీవుడ్ వ్యక్తులు దిల్ రాజుని వ్యతిరేకించారు. ఇక ఇటీవల సంక్రాంతికి వేరే భాష సినిమాలకి థియేటర్స్ ఎక్కువ ఇవ్వొద్దని చెప్పడంతో అది పెద్ద వివాదంగా మారింది. ఇలా సినిమా మొదలుపెట్టిన దగ్గర్నుంచి సినిమా ఏదో ఒక రకంగా వివాదాల్లో ఉంటుంది.

తాజాగా వారసుడు మరో కష్టంలో పడింది. ఇటీవల వారసుడు సినిమాలో ఏనుగులు వాడినట్లు సమాచారం వచ్చింది. కొన్ని ఫోటోలు కూడా సెట్స్ నుంచి లీక్ అయ్యాయి. దీంతో యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు వారసుడు సినిమాకి నోటీసులు ఇచ్చారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972కి సంబందించి జంతువులతో షూటింగ్ చేయాల్సి వస్తే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి అంతేకాకుండా ఏ జంతువులతో, ఎన్నాళ్లు, ఎలా షూటింగ్ చేస్తున్నారో క్లియర్ గా యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ కి చెప్పి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది.

కానీ వారసుడు టీమ్ ఇవేం లేకుండానే ఏనుగులతో షూటింగ్ చేస్తున్నారని తెలియడంతో వారం రోజుల్లోగా దీనికి సమాధానం చెప్పాలంటూ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వారసుడు టీమ్ కి నోటీసులిచ్చింది. దీంతో చిత్రయూనిట్ షాక్ అయింది. ఇప్పటికే వరుస వివాదాల్లో ఉన్న వారసుడుకి మరో తలనొప్పి జత చేరడంతో మరి దీనిపై దిల్ రాజు ఎలా స్పందిస్తాడో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News