Friday, June 6, 2025
Homeనేషనల్RBI: రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన

RBI: రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన

2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రూ.2000 నోట్లను చలామణిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ నోట్లను కూడా మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్న విషయం విధితమే. అయితే నోట్లు ఇంకా పూర్తి స్థాయిలో వెనక్కి రాలేదని.. వేల కోట్ల రూపాయల రూ.2000 నోట్లు ప్రజల దగ్గరే ఉన్నాయని ఆర్బీఐ నివేదికలో వెల్లడించింది.

- Advertisement -

రిజర్వ్ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2025 మే 31 నాటికి ఇంకా రూ.6,181 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని తేలింది. 2023 మే 19న రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వాస్తవానికి ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి 2023 అక్టోబర్ 7వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఆ గడువు ముగిసిన తర్వాత ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే ఈ నోట్లను మార్చుకోవడానికి లేదా తమ ఖాతాల్లో జమ చేసుకోవడానికి అవకాశం కల్పించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News