Friday, June 6, 2025
Homeఆంధ్రప్రదేశ్Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురి మృతి

Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురి మృతి

తూర్పుగోదావరి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. రంగంపేట మండలం వడిశలేరు సమీపంలో ఆయిల్‌ ట్యాంకర్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కారు రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను రాజమహేంద్రవరం కవలగొయ్యికి చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News