ఇవాళ విడుదలైన ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్(JEE-Advanced 2025) ఫలితాలలో “అల్ఫోర్స్” విద్యార్థులు వివిధ క్యాటగిరీలలో జాతీయస్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించినట్లు “అల్ఫోర్స్”(Alphores) విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ ఫలితాల్లో అజ్మీరా పురుషోత్తం నాయక్ 166వ ర్యాంకు సాధించగా, పి.ఎన్. సాయిధృవ 557వ ర్యాంక్, ఎన్. అనిరుద్సాయి 657వ ర్యాంక్, బి. అదిత్యా 945వ ర్యాంక్, బి.చైశ్రవ్ రాజు 1640, ఇ. శశిలాల్ 1899, కె. విరేంద్రప్రసాద్ 2120, డి. కార్తిక్డ్డి 2150, ఎస్. విఘ్నేష్ 2293,డి. అభిరామ్ 2349, ఎ. శశిప్రితమ్ 2463, ఇ. అంకీత్సాయి 2613, మహ్మద్బ్దులాక్ 2766, డి. విశాల్ 2917 ర్యాంకులు సాధించి “అల్ఫోర్స్” ఖ్యాతిని మరింత పెంచారని అన్నారు.
1,000 లోపు 4 మంది విద్యార్థులు, 2,000 లోపు 11 మంది విద్యార్థులు, 3,000 లోపు 19 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించడం విశేషమని పేర్కొన్నారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ మరియు విద్యార్థుల ఆహర్నిశ కృషి ఇంతటి ఘనవిజయానికి తోడ్పడ్డాయని, ప్రతి సంవత్సరం అల్ఫోర్స్ అందించిన ఐఐటి కోచింగ్ ద్వారా ప్రతిష్టాత్మక ఐఐటిలలో సీట్లు సాదించే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. నీట్ మరియు ఎంసెట్ లో కూడా అల్ఫోర్స్ చిన్నారులు అద్భుతంగా రాణించారని వెల్లడించారు.
ఐఐటి-2025 ఫలితాలలో అద్భుత ర్యాంకులు సాధించిన అల్ఫోర్స్ అణిముత్యాలను మరియు వారి తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని.. ఇంతటి ఘనవిజయానికి తోడ్పడిన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.