Friday, June 6, 2025
Homeఆంధ్రప్రదేశ్Machilipatnam: మచిలీపట్నంలో మంచు మనోజ్‌, నారా రోహిత్‌ సందడి

Machilipatnam: మచిలీపట్నంలో మంచు మనోజ్‌, నారా రోహిత్‌ సందడి

మచిలీపట్నంలో హీరోలు మంచు మనోజ్‌(Manchu Manoj), నారా రోహిత్‌(Nara Rohith) సందడి చేశారు. బీచ్ ఫెస్టివల్ సందర్భంగా నిర్వహించిన 2కె రన్‌ను మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరితో కలిసి ప్రారంభించారు. వీరిని చూసేందుకు జనం ఎగబడ్డారు. పట్టణంలోని కోనేరు సెంటర్‌ నుంచి లక్ష్మీ టాకీస్‌ వరకు రన్‌ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్‌ కొనకళ్ల నారాయణ, కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ, ఎస్పీ ఆర్‌.గంగాధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరోలు మాట్లాడుతూ.. మచిలీపట్నం రావడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ పోర్టు నిర్మిస్తున్న సీఎం చంద్రబాబుకు సెల్యూట్‌ అని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News