అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. సీనియర్ హీరో నాగార్జున(Nagarjuna) రెండో కుమారుడు అఖిల్ వివాహం ఈ నెల 6వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జున పలువురు ప్రముఖులను స్వయంగా కలిసి వివాహ వేడుకకు ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన తాజాగా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబును(Chandrababu) కలిశారు.
- Advertisement -
తన కుమారుడు అఖిల్ వివాహానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు నాగార్జున అందజేశారు. అనంతరం కాసేపు వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు. కాగా ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని నాగార్జున ఆహ్వానించిన విషయం విధితమే.
