Friday, June 6, 2025
Homeఆంధ్రప్రదేశ్Nagarjuna: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన నాగార్జున

Nagarjuna: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన నాగార్జున

అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. సీనియర్ హీరో నాగార్జున(Nagarjuna) రెండో కుమారుడు అఖిల్ వివాహం ఈ నెల 6వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జున పలువురు ప్రముఖులను స్వయంగా కలిసి వివాహ వేడుకకు ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన తాజాగా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబును(Chandrababu) కలిశారు.

- Advertisement -

తన కుమారుడు అఖిల్ వివాహానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు నాగార్జున అందజేశారు. అనంతరం కాసేపు వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు. కాగా ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని నాగార్జున ఆహ్వానించిన విషయం విధితమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News