హిందూ ధర్మంలో శని దేవునికి విశేషమైన స్థానం ఉంది.. ముఖ్యంగా శనివారం నాడు శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇలా పూజలు చేయడం ప్రాచీన సంప్రదాయం. నీలి రంగు వస్త్రాలు ధరించి, నీలి అపరాజితా పుష్పాలతో శని దేవునిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. అయితే చాలామందికి తెలియనిది.. శని దేవుని విగ్రహాన్ని ఇంట్లో ఉంచరాదని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడు శాపగ్రస్తుడు. ఆయనను ఇంట్లో ప్రతిరోజూ దర్శించడంవల్ల నెగెటివ్ ఎనర్జీ పెరగవచ్చని, ఆయన్ని కళ్లలోకి నేరుగా చూడకూడదని పండితులు చెబుతున్నారు. ఇంట్లో శని విగ్రహం ఉంచడం వల్ల కుటుంబంపై ప్రతికూల ప్రభావాలు ఏర్పడే అవకాశముందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
అయితే శనీశ్వరుడి పూజ కోసం.. ప్రతి శనివారం ఆలయానికి వెళ్లాలి. ఆ సమయంలో కూడా శనీశ్వరుని పాదాలవైపు చూస్తూనే పూజ చేయాలని సూచించారు. అలాగే శని గ్రహ ప్రభావం ఎంతో కాలం మన జీవితంపై కొనసాగుతుందని.. అందువల్ల శాస్త్రోక్తంగా శనిని శాంతింపజేయడం అవసరమని తెలిపారు.