Kiwi Fruit Benefits: కివి పండు అనేది తియ్యగా, కొద్దిగా పుల్లగా ఉండే ఒక అద్భుతమైన పండు. ఇది పోషకాల గని అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీనికి “చైనీస్ గూస్ బెర్రీ” అనే పేరు కూడా ఉంది. ఈ పండు డెంగ్యూ, తరుచుగా వచ్చే ఆరోగ్యసమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. కివి పండులో విటమిన్ సి, కె, ఇ,బి9 ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.
కివి పండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
జీర్ణక్రియ: కివి పండు జీర్ణక్రియవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఇది మలబద్ధకం, అజీర్ణం వంటి ఇతర సమస్యలను కూడా తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజు ఒకటి లేదా రెండు కివి పండ్లను తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి.
కంటి చూపు: కంటి చూపు సమస్యలతో బాధపడేవారు కూడా ఈ పండును తినవచ్చు. ఇందులో ఉండే లుటిన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు కంటి సమస్యలు బారిన పడకుండా చేస్తాయి. అలాగే ఇందులో విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది.
రోగనిరోధక శక్తి: కివిలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది తరుచుగా వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.
గుండె రక్షణ: గుండె సమస్యలతో బాధపడేవారికి కివి పండు ఒక అద్భుతమైన ఆహారం. ఇందులో ఉండే పొటాషియం, ఫైబర్ ఇతర పోషకాలు గుండె సమస్యలు కలగకుండా చేస్తుంది.అధిక రక్తపోటుతో బాధపడేవారు కూడా ఈ పండు తింటే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
చర్మఆరోగ్యం: చర్మం కాంతివంతంగా కనిపించడంలో కూడా కివి సహాయపడుతుంది. ఇందులో ఉండే కొల్లాజెన్లు చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ను తొలగించడంలో కీలక ప్రాత పోషిస్తాయి. చర్మంపై కలిగే నల్ల మచ్చలు, మొటిమలు కూడా తగ్గుతాయి.
నిద్రలేమి సమస్యలు: సెరోటోనిన్ అనే రసాయనం కివి పండులో అధికంగా ఉంటుంది. ఇది నిద్రలేమి సమస్యలను నియంత్రించడంలో కీలక ప్రాత పోషిస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు ఒక కివి పండ్లు తినడం వల్ల మెరుగైన నిద్రను పొందవచ్చు.
బరువు నియంత్రణ: కివిలో తక్కువ కేలరీలు,ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది దీని వల్ల అతిగా అతిగా తినాలనే కోరికకు తగ్గిస్తుంది.
అయితే కివి పండు ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికి దీని కొన్ని ఆరోగ్యసమస్యలు ఉన్నవారు తినకూడదు..
కివి పండును ఎవరు తినకూడదు?
కిడ్నీ సమస్యలు: కివి పండును కిడ్నీ సమస్యలు ఉన్నవారు తినకూడదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పొటాషియం కిడ్నీలో పేరుకుపోయే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
జీర్ణ సమస్యలు: కివిలో యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జీర్ణ సమస్యలు ఉన్నవారు కివి తినడం వల్ల సమస్య మరింత తీవ్రం కావచ్చు.
అలెర్జీలు ఉన్నవారు: కొంతమందికి కివి పండు మంచిది కాదు. కివి పండును అలెర్జీ ఉన్నవారి తింటే చర్మంపై దద్దుర్లు, దురద, వాపు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు.
గమనిక: ఆరోగ్యసమస్యలతో బాధపడేవారు కివి పండు తినే ముందు వైద్యుల సలహాల తీసుకోవడం మంచిది. కివి పండు మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల పైన తెలిపిన ఆరోగ్యలాభాలను పొందవచ్చు.