తెలంగాణ డీఈఈసెట్-25 ఫలితాలు(DEECET Results)విడుదలయ్యాయి. 2025–28 విద్యాసంవత్సరంలో రెండేళ్ల డీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రవేశాలకు మే 25న ఆన్లైన్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన ఫలితాల్లో మొత్తం 78.18 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిటనట్లు అధికారులు తెలిపారు. తెలుగు మీడియంలో 77 మార్కులు సాధించి తక్కళ్లపల్లి హరిత.. ఇంగ్లీష్ మీడియంలో 37 మార్కులు సాధించి పసునూరి అభినవ రెడ్డి.. ఉర్దూ మీడియంలో 87 మార్కులు సాధించి ఫరాజ్ ఆహ్మద్లు స్టేట్ టాపర్స్ గా నిలిచారు
ఇక ఈ పరీక్షకు మొత్తం 48,815 మంది దరఖాస్తు చేసుకోగా 33,321 మంది హాజరయ్యారు. వీరిలో 28,442 మంది ఉత్తీర్ణత సాధించారు. తెలుగు మీడియంలో మొత్తం19,900 మంది దరఖాస్తు చేసుకోగా.. 15,478 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 11,288 మంది క్యాలిఫై అయ్యారు. ఇంగ్లీష్ మీడియంలో మొత్తం 22,051 మంది విద్యార్థులకు గాను 18,983 మంది పరీక్ష రాయగా.. 14,848 క్వాలిఫై అయ్యారు. ఉర్దూ మీడియంలో మొత్తం 1,884 మందికి గాను 1,982 మంది పరీక్ష రాయగా 530 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఈ ఫలితాల్లో వచ్చిన స్కోర్, ర్యాంకు ఆధారంగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (DELED), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (DPSE) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. డీఈఐఈడీ, డీపీఎస్ఈ కోర్సుల్లోని సీట్ల భర్తీ కౌన్సెలింగ్ ఈ నెల 9 నుంచి ప్రారంభంకానుందని అధికారులు తెలిపారు. ఈ నెల 9 నుంచి 13 వరకు రాష్ట్రంలోని 10 డైట్ కాలేజీల్లో అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఈ నెల 14 నుంచి 17 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 50కి పైగా డైట్ కాలేజీల్లో 4000 సీట్లున్నట్లు సమాచారం. మొత్తం సీట్లలో 85 శాతం సీట్లను స్థానిక అభ్యర్థులకు, 15 శాతం సీట్లను స్థానికేతరులకు కేటాయిస్తారు.
TS DEECET Results 2025: తెలంగాణ డీఈఈసెట్ ఫలితాలు విడుదల
- Advertisement -