Sunday, June 8, 2025
Homeఇంటర్నేషనల్Future Predictions: ప్రళయం వచ్చేస్తోంది.. భూమి అంతాకి డేట్ ఫిక్స్.. భయపెడుతున్న భవిష్యవాణులు..!

Future Predictions: ప్రళయం వచ్చేస్తోంది.. భూమి అంతాకి డేట్ ఫిక్స్.. భయపెడుతున్న భవిష్యవాణులు..!

ప్రళయం ముంచుకొస్తుందా.. మానవాళికి ప్రమాదం పొంచి ఉందా.. భూమి నాశన దిశగా దూసుకెళుతోందా.. ఈ ప్రశ్నలు ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ప్రకృతి మారుతున్న తీరు, యుద్ధాల ముప్పు, విపత్కర భూకంపాలు, కొత్త వైరస్‌ల విజృంభన.. ఇవన్నీ చూస్తే భవిష్యత్తుపై భయానకమైన ఊహలు చెమటలు పట్టిస్తున్నాయి. 2025 ప్రపంచంలో ప్రళయాలు తప్పవని.. ప్రముఖ భవిష్యవక్తలు బాబా వంగా, నోస్ట్రాడమస్, అథోస్ సలోమ్, నికోలస్ అజౌలా ఇలా పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

బాబా వంగా ప్రకారం ఈ ఏడాది భూకంపాలు పెరుగుతాయి. వాటి ప్రభావం యూరప్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. యుద్ధాల ముప్పుతో పాటు వాతావరణ మార్పు కూడా మానవాళిపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆమె చెబుతున్నారు. ఇవన్నీ కలిసి మానవతా విలువల పతనానికి నాంది పలుకుతాయని ఆమె పేర్కొన్నారు. నోస్ట్రాడమస్ అయితే ఆ స్ంద్సర్ మరింత దారుణంగా ఉంటుందని అన్నారు. ‘లెస్ ప్రొఫెటీస్’ పుస్తకంలో ఇంగ్లాండ్‌పై విదేశీ దాడుల ముప్పు, దేశీయంగా అంతర్గత కలహాలు, ఇంకా ఒక కొత్త మహమ్మారి గురించి ప్రస్తావించారు. అది COVID-19 మాదిరిగా ప్రాణాలు బలిగొనగలదని ఆయన ఊహించారు.

అలాగే, “ఆధునిక నోస్ట్రాడమస్”గా పేరొందిన బ్రెజిల్‌కు చెందిన అథోస్ సలోమ్ కూడా ప్రపంచంపై త్వరలో పడనున్న ముప్పును హెచ్చరించారు. 38 ఏళ్ల అథోస్ ఇప్పటికే బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణాన్ని ముందుగా అంచనా వేసినందుకు ప్రపంచదృష్టిని ఆకర్షించారు. తాజాగా అతను చెప్పింది మరింత ఆందోళన కలిగించేలా ఉంది.. మూడో ప్రపంచ యుద్ధం చాలా దగ్గర్లో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌కు చెందిన నికోలస్ అజౌలా కూడా ఈ ఏడాది ప్రపంచానికి కల్లోలాన్ని తెస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ, భౌగోళికంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయని ఆయన చెబుతున్నారు.

ఈ మేరకు వరుసగా వివిధ కోణాల నుంచి వచ్చే హెచ్చరికలు ప్రస్తుతం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈ భవిష్యవాణులు ఎంతవరకూ నిజమవుతాయన్నదానిపై స్పష్టత లేకపోయినా, వాటిలో ఉన్న హెచ్చరికలపై ప్రపంచం గమనించాల్సిన అవసరం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News