Manipur Internet Ban: నిత్యం సంఘర్షనలతో నిప్పుల కుంపటిలా మారిన మణిపుర్లో నిరసనలను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఇంటర్నెట్పై నిషేధం విధించింది. మైతేయ్ సమూహానికి చెందిన నేత అరంబాయి టెంగోల్ అరెస్టు నేపథ్యంలో… నిన్న అర్ధరాత్రి ఆందోళనలు చెలరేగాయి. ఇంఫాల్ వ్యాలీ, రాజధాని పరిసర ప్రాంతాలతో పాటు ఉరిపోక్, కావ్కైతెల్ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు టైర్లు ఫర్నిచర్ కాల్చుతూ రోడ్లపై ఆందోళనలు చేపట్టారు. ఈ పరిస్థితులను సమీక్షించిన ప్రభుత్వం ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, తౌబాల్, బిష్ణుపూర్, కాక్చింగ్ జిల్లాల్లో ఐదు రోజుల పాటు ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలను(వీసాట్, VPN సహా) నిలిపివేయాలని ఆదేశించింది. సామాజిక మాధ్యమాల వేదికగా.. విద్వేష ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొట్టి అక్కడ అల్లర్లు చేసే అవకాశం ఉన్నట్లు పోలీసు యంత్రాంగం గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రత చర్యల్లో భాగంగా… ఎలాంటి అశాంతి చెలరేగకుండా ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా ఆయా జిల్లాల్లో 5 రోజులపాటు నిషేదిస్తున్నట్లు పేర్కొంది. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మొద్దని… శాంతి భద్రతలకు సహకరించాలని కోరింది. ప్రభుత్వ నిర్ణయాలను ఉల్లంఘించిన వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి అధికార ఉత్తర్వు విడుదల చేసింది.