జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భౌతికకాయానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. గోపినాథ్ పిల్లలను దగ్గరికి తీసుకుని ఓదార్చి ధైర్యం చెప్పారు. పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాగా మూడు రోజుల క్రితం గుండెపోటుకు గురైన గోపినాథ్ ఇవాళ ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే.