Telangana Brand Rice In Open Market: రాష్ట్రంలో సన్న వడ్ల దిగుబడి అధికంగా ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ లో ‘తెలంగాణ బ్రాండ్’ పేరుతో అత్యంత నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు విక్రయించాలని పథకం రచించింది. అవసరాలకు మించి సన్న వడ్లు ఉత్పత్తి అవుతుండటంతో.. మిగులు ధాన్యాన్ని వినియోగించుకోవాలని, రైతులకు లాభాలు చేకూర్చాలని ప్రణాళిలు రచిస్తుంది. ప్రస్తుతం పౌరసరఫరాల సంస్థ ప్రత్యేకంగా ఈ సన్నరకం బియ్యాన్ని నిల్వ చేసింది. అందులో భాగంగా బీపీటీ, జై శ్రీరాం, ఆర్ఎన్ఆర్ వంటి బియ్యపు రకాలను ప్రభుత్వమే సొంతంగా మిల్లింగ్ చేసి సొంత బ్రాండ్తో విక్రయించాలని చూస్తుంది. సూపర్ మార్కెట్లు, కిరాణా, రేషన్ షాపులతో పాటుగా ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశాల కోసం దారులు వెతుకుతుంది. మన్నికతో పాటుగా సరసమైన ధరలలో మార్కెట్ పోటీని ఎదుర్కొనేలా ఏపీఎల్ కార్డుదారుల కంటే చౌకగా బియ్యాన్ని విక్రయించేందుకు కసరత్తులు చేస్తుంది.
సన్న బియ్యం రైతులకు లాభం చేకూరేలా..
వానాకాలం, యాసంగి కాలాల్లో సన్నధాన్యం ఉత్పత్తి రాష్ట్రంలో భారీగా పెరిగింది. దీనితో రాష్ట్ర నలుమూలల నుంచి కొనుగోలు కేంద్రాలకు భారీ మొత్తంలో సన్నధాన్యం వచ్చింది. యాసంగిలో పండే పంటతో పోల్చితే ప వానాకాలంలో సాగు చేసే పంటలో నూకలు తక్కువగా ఉండటంతో పాటుగా బియ్యం నాణ్యంగా ఉంటాయి. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వానాకాలం కొనుగోలు చేసిన వడ్లతో వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. వానకాలం సాగు కొనుగోలు చేసిన బియ్యాన్ని ‘తెలంగాణ బ్రాండ్’ పేరుతో మార్కెట్ లో విక్రయించనున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. ఇది రైతులకు లబ్ధి చేకూరడంతో పాటుగా మద్దతు ధర లభించడానికి, అధిక అధిక దిగుబడికి ప్రయోజనాలు ఇస్తుందని ప్రోత్సాహం అధికారులు భావిస్తున్నారు.
దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నవారికై..
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బ్రాండ్ బియ్యాన్ని సూపర్మార్కెట్లు, కిరాణా దుకాణాలకు మాత్రమే పరిమితం చేయకుండా రేషన్ షాపుల్లోనూ విక్రయించనున్నారు. ఇప్పటివరకు ఆహార భద్రత కార్డు (Below poverty Line) ఉన్నవారికి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. త్వరలో దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నవారికి (Above Poverty Line) కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఏపీఎల్ కార్డుదారులు తమకు అవసరమైన ‘తెలంగాణ బ్రాండ్’ బియ్యాన్ని రాష్టంలోని రేషన్ దుకాణాల ద్వారా మార్కెట్ ధరతో పోలిస్తే సరసమైన ధరకు కొనుగోలు చేసేలా అవకాశం కల్పించానున్నారు. ఇది రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంత మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరుస్తుందని అధికారులు భావిస్తున్నారు.
త్వరలో ధర పై స్పష్టత..
రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ బ్రాండ్’ పేరుతో విక్రయించే ఈ సన్నరకం బియ్యానికి ధర ఎంత నిర్ణయించాలన్న విషయంపై అధికారులు త్వరలో ఓ స్పష్టత నిచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మార్కెట్లో ఉన్న వివిధ రకాల సన్నబియ్యం ధరలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. భారత ఆహార సంస్థకి విక్రయించిన ధాన్యానికి.. డబ్బులు రావడానికి ఆరు నెలల నుంచి ఏడాది వరకు సమయం పడుతుంది.అదే క తెలంగాణ బ్రాండ్తో బియ్యాన్ని నేరుగా విక్రయించడం ద్వారా త్వరగా ఆదాయం పొందవచ్చని ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రయత్నం రాష్ట్రానికే పరిమితం చేయకుండా ఇతర రాష్ట్రాల్లోనూవిక్రయించేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తులు చేస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం తెలంగాణ బ్రాండ్కు దేశవ్యాప్తంగా గుర్తింపుతో పాటుగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి రైతులకు సాగులో అమ్మకపు కష్టాలను సులభతరం చేస్తుందని భావిస్తున్నారు.