ఇటీవల థియేటర్స్ బంద్ వివాదం ఏపీ ప్రభుత్వం, టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీ మధ్య గ్యాప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో సినీ పెద్దలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తమ తప్పు లేదంటూ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి క్లారిటీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఎందుకు సీఎం చంద్రబాబు(CM Chandrababu)ను కలవలేదు అంటూ పవన్ మండిపడ్డారు. దీంతో సీఎంను కలవడానికి సిద్ధమయ్యారు.
ఈమేరకు ముహుర్తం కూడా ఖరారైంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కలవనున్నారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. తొలుత పవన్ కళ్యాణ్ ను కలవనున్న ప్రముఖులు.., తర్వాత పవన్ తో కలిసి చంద్రబాబుతో సమావేశం కానున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం హీరోలు బాలకృష్ణ, వెంకటేష్, నాని, మనోజ్, సుమన్, ఆర్.నారాయణమూర్తి.. నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, అశ్వనీ దత్, డీవీవీ దానయ్య.. దర్శకుడు రాజమౌళి, బోయపాటి శీను, త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగ్ అశ్విన్ చంద్రబాబును కలిసే వారిలో ఉన్నారు. ఈ సమావేశం అనంతరం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా సమావేశం అవుతారు.
ఇదిలా ఉంటే గతంలో కూడా మూవీ టికెట్ రేట్లు, థియేటర్స్ సర్దుబాటు వంటి అంశాలపై మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్. కొరటాల శివ వంటి ప్రముఖులు అప్పటి సీఎం జగన్ ని కలిసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చిరంజీవి జగన్ కు దండం పెడుతూ రిక్వెస్ట్ చేయడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీఎం చంద్రబాబును టాలీవుడ్ పెద్దలు కలవనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
Tollywood: సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యే సినీ ప్రముఖులు వీరేనా..?
సంబంధిత వార్తలు | RELATED ARTICLES