Sunday, June 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Nara Lokesh: సవాల్ చేస్తే జగన్ సౌండ్ ఆఫ్.. లోకేశ్ సెటైర్లు

Nara Lokesh: సవాల్ చేస్తే జగన్ సౌండ్ ఆఫ్.. లోకేశ్ సెటైర్లు

Nara Lokesh: ఏపీలో కీలకమైన తల్లికి వందనం పథకం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతి విద్యార్థికి రూ.1300 చొప్పున ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందకి డబ్బులను తల్లుల ఖాతాలో ప్రభుత్వం జమచేస్తుంది. అయితే ముందుగా చెప్పిన దాని ప్రకారం రూ.15వేలు ఇవ్వకుండా రూ.2వేల కట్ చేసి రూ.13వేల ఇస్తుండటంపై ప్రతిపక్ష వైసీపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh)పై విమర్శలు చేస్తోంది. కట్ చేస్తున్న రూ.2వేలు లోకేశ్ జేబులోకి వెళ్లాయంటూ ఆరోపణలు చేసింది.

ఈ ఆరోపణలపై లోకేశ్ ఘాటుగా స్పందించారు. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను 24 గంటల్లోగా నిరూపించాలని డిమాండ్ చేశారు. లేదంటే లీగల్ యాక్షన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. లోకేశ్ ఛాలెంజ్ పై వైసీపీ తనదైన శైలిలో స్పందించింది. వైసీపీ హయాంలో అమ్మఒడి పథకం కింద పాఠశాలలో మౌలిక వసతుల కోసం కట్ చేసిన రూ.2వేలు అప్పటి సీఎం జగన్ జేబులోకి వెళ్లాయంటూ ఆరోపణలు చేయలేదా అని ప్రశ్నించింది. మరి ఈ ఆరోపణలపై ఎవరిపై కేసులు పెట్టాలని నిలదీసింది.

తాజాగా లోకేశ్ వ్యంగ్యంగా మరో ట్వీట్ చేశారు. సవాల్ చేస్తే జగన్ సౌండ్ ఆఫ్ అయిందంటూ ఎద్దేవా చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. బురద చల్లడం పారిపోయి ప్యాలెస్‌లో దాక్కోవడం జగన్ కి అలవాటు అని సెటైర్లు వేశారు. తల్లికి వందనం డబ్బులు తన జేబులోకి వెళ్ళాయి అంటూ చేసిన ఆరోపణలు 24 గంటల్లో నిరూపించాలని ఛాలెంజ్ చేశానని గుర్తు చేశారు. ఇప్పుడు సమయం ముగిసినా రుజువు చెయ్యలేదని., క్షమాపణ కూడా కోరలేదని తెిపారు. అందుకే లీగల్ యాక్షన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండని హెచ్చరించారు. సమయం లేదు మిత్రమా! శరణమా… న్యాయ సమరమా? తేల్చుకోండి అంటూ జగన్ కు అల్టీమేటం జారీ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News