Tuesday, June 17, 2025
HomeNewsINDIRA NAGAR GOVT SCHOOL : సీఎంఓ నుంచి సిఫార్సులు

INDIRA NAGAR GOVT SCHOOL : సీఎంఓ నుంచి సిఫార్సులు

Siddipet Indira Nagar Govt School : సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల తెలంగాణ విద్యా రంగంలో అద్భుత నమూనాగా నిలుస్తోంది. ఒకప్పుడు చిన్నచూపు చూసిన ఈ ప్రభుత్వ బడిలో, ఇప్పుడు సీఎం కార్యాలయం నుంచి కూడా అడ్మిషన్ల కోసం సిఫార్సులు వస్తున్నాయి. ఆన్‌లైన్ అడ్మిషన్లు, డిజిటల్ క్లాసులు, ఐఐటీ ఫౌండేషన్ కోర్సులతో ఈ పాఠశాల కార్పొరేట్ సంస్థలకు దీటుగా నిలబడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్య సాధ్యమేనని అసాధారణ ఫలితాలతో నిరూపిస్తూ, లక్షల మందికి ఆదర్శంగా నిలుస్తోంది.

- Advertisement -


ప్రభుత్వ విద్యకు నయా ట్రెండ్ సెట్టర్ : పాఠశాలలకు సెలవులు ముగియగానే తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రైవేటు బడుల వైపు పరుగులు పెట్టే తల్లిదండ్రుల ధోరణికి భిన్నంగా, సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల అసాధారణంగా నిలుస్తోంది. ఇక్కడ సీట్ల కోసం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక కౌన్సిలర్లు సైతం ప్రిన్సిపాల్‌తో మాట్లాడి, తమ వారికి సీటు ఇప్పించాలంటూ ఒత్తిడి తెస్తున్నారంటే, ఈ పాఠశాలకు ఉన్న డిమాండ్ స్పష్టమవుతుంది. దాదాపు పదేళ్ల క్రితం 300 మంది విద్యార్థులకు మాత్రమే పరిమితమైన ఈ పాఠశాలలో, నేడు 1200 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

పాఠశాల ప్రత్యేకతలు :
ఈ పాఠశాలలో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఉన్నటువంటి ఐదు తరగతులకు 23 సెక్షన్లున్నాయి. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్‌లు, విదేశీ భాషల బోధనతో పాటుగా, ఆన్‌లైన్ తరగతులు, ఐఐటీ ఫౌండేషన్ విద్య వంటి అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.విద్యార్థులకు విశాలమైన క్రీడా స్థలం, అత్యంత ఆధునిక వసతులతో కూడిన 24 తరగతి గదులు ఉన్నాయి. ఒక్కో సబ్జెక్టుకు నలుగురు నిష్ణాతులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉండటం ఇక్కడి విద్యా ప్రమాణాలకు నిదర్శనం.


హరీష్ రావు కృషి – వినూత్న అడ్మిషన్ల ప్రక్రియ
ఇందిరానగర్ పాఠశాల అసాధారణ విజయానికి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు కృషి ఎంతో ఉంది. ఆయన CSR నిధుల ద్వారా, ఆధునిక తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్‌లు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేయించారు. మంత్రిగా ఉన్నప్పుడు పాఠశాలను ఆకస్మికంగా సందర్శించడమే కాకుండా, విదేశీ భాషలు, ఐఐటీ ఫౌండేషన్ కోర్సులను పరిచయం చేయడంలో, డిజిటల్ కంటెంట్ విద్యా విధానాన్ని అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నిరంతర కృషి ఫలితంగా, పాఠశాల పదో తరగతి ఫలితాల్లో అత్యధిక ఉత్తీర్ణత, అత్యున్నత ర్యాంకులు సాధించింది.

ఈ ప్రభుత్వ పాఠశాల ప్రవేశ ప్రక్రియలో వినూత్నంగా ఆన్‌లైన్ దరఖాస్తు విధానాన్ని అమలు చేస్తోంది. 6వ తరగతిలోని 180 సీట్లకు ఇప్పటికే 600 పైగా దరఖాస్తులు అందగా, QR కోడ్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అనాథలు, సింగిల్ పేరెంట్ పిల్లలు, నిరుపేదలైన విద్యార్థులకు మానవతా కోణంలో ప్రాధాన్యతనిచ్చిన తర్వాత, మిగిలిన సీట్లను ప్రవేశ పరీక్ష ద్వారా అత్యంత పారదర్శకంగా ఎంపిక చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News