Iranian Missile Touched Us Embassy: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలు నిరంతరం పెరుగుతూ, ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్ర సవాలు విసురుతున్నాయి. ఇటీవల, ఇరాన్ ఇజ్రాయెల్పై జరిపిన క్షిపణి దాడులు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. ఈ దాడుల్లో టెల్ అవీవ్లోని అమెరికా రాయబార కార్యాలయానికి సమీపంలో ఒక క్షిపణి పడటంతో, కార్యాలయం స్వల్పంగా దెబ్బతిన్నట్లు అమెరికా రాయబారి మైక్ హుక్కబీ వెల్లడించారు. ఈ ఘటనలో ప్రాణనష్టం లేదా తీవ్ర గాయాలు లేవని ఎంబసీ స్పష్టం చేసినప్పటికీ, ఇది అంతర్జాతీయ సమాజంలో తీవ్ర ఆందోళనలకు దారితీసింది. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఈ దాడులు, కేవలం ద్వైపాక్షిక సమస్యగా కాకుండా, ప్రపంచ భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి తర్వాత, టెల్ అవీవ్లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. అమెరికా పౌరులు అత్యవసర సమాచారం కోసం ఎంబసీ వెబ్సైట్ను ద్వారా సంప్రదింపులు చేయాలని సూచించారు.
ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు: ట్రంప్ స్పందనపై ప్రపంచ ఆసక్తి
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య క్షిపణి దాడులు తీవ్రతరం అవుతున్నాయి. తాజాగా, ఇరాన్ దాడిలో టెల్ అవీవ్లోని అమెరికా రాయబార కార్యాలయానికి స్వల్ప నష్టం వాటిల్లడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటన తర్వాత, ఈ విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా స్పందిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం మొదలయ్యాక అమెరికాకు సంబంధించి నేరుగా నష్టం జరగడం ఇదే మొదటిసారి.
అమెరికా వైఖరి, ట్రంప్ హెచ్చరిక :
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సైనిక జోక్యానికి అమెరికా నిరాకరిస్తున్నప్పటికీ, ఈ వివాదం మొదలైనప్పటి నుంచి అమెరికా తన వైఖరిని స్పష్టం చేస్తూనే ఉంది. ఇజ్రాయెల్ మొదట చేసిన దాడితో తమకు సంబంధం లేదని అమెరికా ఇదివరకే పేర్కొంది. అయితే, పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి చేస్తే మాత్రం ఊరుకునేది లేదని, పూర్తి సైనిక చర్య చేపడతామని ఆదివారమే ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన దాడికి ట్రంప్ ఎలా ప్రతిస్పందిస్తారనేది ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది.
ఘర్షణల నేపథ్యం, నష్టాల అంచనా : జూన్ 13న ప్రారంభమైన ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణల్లో ఇరుపక్షాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్లో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
వీరిలో ఆర్మీ ఉన్నతాధికారులు, ప్రముఖ అణు శాస్త్రవేత్తలు ఉన్నారు. మరోవైపు, ఇరాన్ ప్రతీకార దాడుల్లో ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, హైఫా, బెన్ గురియన్ విమానాశ్రయాలపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్లోని ప్రధాన నగరమైన టెల్ అవీవ్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో మరింత అస్థిరతకు దారితీస్తున్నాయి.