Tuesday, June 17, 2025
HomeNewsEC Prioritizes Transparency : పోలింగ్ స్టేషన్లలో 100% వెబ్ కాస్టింగ్

EC Prioritizes Transparency : పోలింగ్ స్టేషన్లలో 100% వెబ్ కాస్టింగ్

EC Webcasting Of Polling Stations : పారదర్శకత, జవాబుదారీతనాన్ని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వంద శాతం పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని తెలిపింది. గతంలో ర్యాండమ్ గా 50 శాతం కేంద్రాల్లో మాత్రమే అమలైన ఈ ప్రక్రియను ఇకపై పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు ఈసీ కసరత్తులు చేస్తోంది.

- Advertisement -


అంతర్గత అవసరాలకే వినియోగిస్తాం : ఇంటర్నెట్ ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ తప్పనిసరి అని, లేనిచోట వీడియోగ్రఫీ వంటి ప్రత్యామ్నాయాలు ఉంటాయని ఈసీ స్పష్టం చేసింది. వెబ్ కాస్టింగ్ ఫుటేజీ కేవలం అంతర్గత అవసరాలకే వినియోగిస్తామని, దీని పర్యవేక్షణకు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కంట్రోల్ రూంలు, నోడల్ ఆఫీసర్లను నియమించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.


ఈసీ లక్ష్యం – సమర్థ పర్యవేక్షణ: వెబ్ కాస్టింగ్ జరిగే పోలింగ్ కేంద్రాలను లైవ్‌లో నిశితంగా పర్యవేక్షించడమే ఈ ఏర్పాటు ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. నోడల్ ఆఫీసర్లు అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌ను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయాలి.
ఈ పర్యవేక్షణ కోసం అవసరమైన సిబ్బందిని వెబ్ కాస్టింగ్ కంట్రోల్ రూంలకు కేటాయించాలని ఈసీ స్పష్టం చేసింది.


బిహార్‌తో శ్రీకారం: ఈ ఏడాది అక్టోబరు-నవంబరులో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనే ఈ 100 శాతం వెబ్ కాస్టింగ్ నిబంధన అమల్లోకి రానుంది. ఈ నిబంధనను అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా బిహార్ నిలవనుంది.


పోలింగ్ కేంద్రాల ఫుటేజీ – ఈసీ నియంత్రణలోనే: ఇప్పటికే పోలింగ్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు, వీడియో రికార్డింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను రికార్డు చేస్తున్నారు.ఇప్పటివరకు ర్యాండమ్‌గా దాదాపు 50 శాతం పోలింగ్ కేంద్రాల్లోనే వెబ్ కాస్టింగ్ జరిగేది. ఇక నుంచి అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ జరిగే వెబ్ కాస్టింగ్ డిజిటల్ సమాచారం కేంద్ర ఎన్నికల సంఘం వద్ద భద్రంగా ఉంటుంది.ఈ సమాచారం ఎన్నికల సంఘం అంతర్గత అవసరాలకు మాత్రమే ఉద్దేశించినదని, తనిఖీ కోసం ఎవరూ అడగడానికి వీలు లేదని ఈసీ స్పష్టం చేసింది.

చట్ట సవరణతో రక్షణ: ఈ మేరకు 2024 డిసెంబరులోనే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల చట్టంలోని ఒక నిబంధనను సవరించింది.కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు ‘1961 -ఎన్నికల నిర్వహణ నియమావళి’లోని 93వ నిబంధనను కేంద్ర న్యాయశాఖ సవరించింది. ఈ సవరణ ద్వారా పోలింగ్ కేంద్రాలతో ముడిపడిన డిజిటల్ రికార్డులను ఎవరూ అడిగి తీసుకోవడానికి వీలుండదు. తాజాగా 100 శాతం వెబ్ కాస్టింగ్‌ నిబంధన అమల్లోకి తెచ్చిన సందర్భంగానూ ఈసీ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News