అప్రమత్తమైంది. రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ అమలుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృషి చేస్తున్నారు. మరోవైపు ఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడులను 21 ముస్లిం దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈమేరకు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఇరాన్ భూభాగంపై ఇజ్రాయెల్ జరిపిన దాడులు అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి చార్టర్ను ఉల్లంఘించడమేనని పేర్కొన్నాయి.
ఈ ఉమ్మడి ప్రకటనపై ఈజిప్ట్, పాకిస్థాన్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, బ్రూనై, చాద్, గాంబియా, అల్జీరియా, కొమొరోస్, జిబౌటి, సూడాన్, సోమాలియా, ఇరాక్, ఒమన్, ఖతార్, కువైట్, లిబియా, తుర్కియే, జోర్డాన్, యూఏఈ, మౌరిటానియా దేశాల విదేశాంగ మంత్రులు సంతకాలు చేశారు. తక్షణమే సీజ్ ఫైర్ అమలు చేయాలని కోరాయి. మిడిల్ ఈస్ట్ దేశాలు అణ్వాయుధ రహితంగా ఉండాలని పిలుపునిచ్చాయి. న్యూక్లియర్ నాన్-ప్రొలిఫెరేషన్ ట్రీటీ(NPT)లో జాయిన్ కావాలని ఆకాంక్షించాయి. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించాయి.
మరోవైపు ఈ దాడుల నేపథ్యంలో చైనా అప్రమత్తం అయింది. ఇజ్రాయెల్ నుంచి తమ పౌరులు విడిచివెళ్లాలని ఇజ్రాయెల్లోని చైనా రాయబార కార్యాలయం కోరింది. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ లోని జనావాసాల మధ్య పడడంతో సామాన్య ప్రజలు చనిపోతున్నారు. అలాగే నివాసాలు కూడా దెబ్బతింటున్నాయి. దీంతో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అప్రమత్తమైంది. ఇరాన్ క్షిపణలును ధీటుగా ఎదుర్కొంటోంది. ఈ నేపత్యంలో పౌరులు ప్రభుత్వం ఆశ్రయాల్లోకి వెళ్లి తలదాచుకోవాలని.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అక్కడే ఉండాలని ఆదేశించింది.
ఇక ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న వేళ భారత్ కూడా అప్రమత్తమైంది. తక్షణమే పౌరులు ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఖాళీ చేయాలని భారత రాయబార కార్యాలయం తెలిపింది. సొంత వనరులు ఉపయోగించుకుని వెళ్లిపోవాలని తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. +989010144557,+989128109115, +989128109109 నెంబర్లకు కాల్ చేయాలని వెల్లడించింది.
Iran-Israel Conflict: ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను ఖండించిన 21 ముస్లిం దేశాలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES