Friday, June 20, 2025
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: తాట తీస్తా.. జగన్‌కు సీఎం చంద్రబాబు వార్నింగ్

CM Chandrababu: తాట తీస్తా.. జగన్‌కు సీఎం చంద్రబాబు వార్నింగ్

CM Chandrababu Warning to Jagan: ఏపీలో రాజకీయ వాతారణం వేడెక్కింది. జగన్ పర్యటనల నేపథ్యంలో ఉద్రికత్త వాతావరణం చోటుచేసుకుంటుంది. ప్రభుత్వం తమ అధినేత పర్యటనలకు ఆటంకాలు కలిగిస్తుందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే.. పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా పర్యటనలు చేస్తున్నారంటూ ప్రభుత్వం కౌంటర్ ఎటాక్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో జగన్ పల్నాడు పర్యటనలో జరిగిన ఘటనలపై ప్రత్యర్థి పార్టీలు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాగే ఈ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన ప్లకార్డులపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరుకుతాం.. చంపుతాం అంటూ బహిరంగంగా వార్నింగ్‌లు ఏంటని మండిపడుతున్నారు. తాజాగా ఈ విమర్శలపై జగన్ తనదైన శైలిలో స్పందించారు. రప్పా రప్పా నరికేస్తామంటూ పుష్ప సినిమాలో డైలాగ్ ప్రదర్శిస్తే తప్పేంటని జగన్ ప్రశ్నించారు.

- Advertisement -

జగన్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రశాంతత చెడగొట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. విచిత్రమైన మనస్తత్వం ఉన్న జగన్.. ఇలా చంపేయండి.. నరికేయండి అంటూ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్రించారు. రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్రభుత్వం జగన్‌కు అనుమతి ఇచ్చిందన్నారు. కేవలం వంద మందితో వెళ్లాలని మాత్రమే పర్యటనకు అనుమతి ఇస్తే వేలాదిగా వెళ్లడం ఏంటని నిలదీశారు. రాజకీయ నేతలు హుందాగా వ్యవహరించాలని.. రెచ్చగొట్టేలా, గొడవలు సృష్టించేలా వ్యవహరించడం సరైంది కాదని హితవు పలికారు.

గంజాయి, బెట్టింగ్, రౌడీలు, బెట్టింగ్, అత్యాచారాలు చేసే వారికి విగ్రహాలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. బెట్టింగ్, గంజాయికి వ్యసనం అయిన వారిని ఎవరైనా ప్రోత్సహిస్తారా? అన్నారు. సంఘ వ్యతిరేక కార్యక్రమాలను నివారించకుండా ఇష్టానుసారంగా సపోర్టు చేస్తారా? అని ఫైర్ అయ్యారు. జగన్ లాంటి నాయకులు ఈ సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారో తెలియడం లేదన్నారు. పర్యటనల పేరుతో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేందుకే జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సినిమా డైలాగులను ఫ్లెక్సీల్లో పెట్టారని జగన్ అనడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. బాబాయ్‌ను లేపేసినా తప్పులేదు అంటే ఎలా? అని దుయ్యబట్టారు.

జగన్ లాంటి మనస్తత్యం ఉన్న నాయకుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక గత ప్రభుత్వంలో జరిగిన ఎన్నో అరాచకాలపై చర్యలు తీసుకోకూడదంటే ఎలా అన్నారు. అవినీతి, అక్రమాలు చేసినవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం హామీల అమలుపై ప్రజలు నిలదీస్తే సమాధానం చెబుతానని.. వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడితే తాటా తీస్తా అని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News