Friday, June 20, 2025
Homeఆంధ్రప్రదేశ్Yoga Day: చరిత్రలో నిలిచిపోయేలా యోగాంధ్ర-2025

Yoga Day: చరిత్రలో నిలిచిపోయేలా యోగాంధ్ర-2025

Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. వైజాగ్‌లో కనివినీ ఎరుగని రీతిలో యోగాంధ్ర-2025కు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా గిన్నిస్ రికార్డులు సృష్టించేందుకు రెడీ అయింది. ఆర్కేబీచ్ సాగర తీరంలో లక్షలాది మందితో యోగాసనాలు వేయించి వరల్డ్ రికార్డ్ నెలకొల్పనుంది. ‘యోగా ఫర్ వన్ ఎర్త్-వన్ హెల్త్’ నినాదంతో నిర్వహిస్తున్న యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలంతా కలిసి రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 26 కిలీమీటర్ల పరిధిలో సుమారు 5లక్షల మంది యోగాసనాలు చేసేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. మెరుగైన ఆరోగ్యం కోసం యోగా మన జీవితంలో భాగం కావాలన్నారు. యోగా వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ మ్యాట్, టీషర్టులు ఉచితంగా ఇవ్వనున్నారు.

- Advertisement -

గిన్నిస్ బుక్‌ రికార్డు సాధించేలా తలపెట్టిన యోగా కార్యక్రమానికి విశాఖ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే నగరంలో యోగా దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. యోగాసనాలు చేసేందుకు ప్రధాని మోదీ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్కే బీచ్‌ వేదిక వద్ద అద్భుత కళాఖండాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా విశాఖ నగరం అందరి దృష్టి ఆకర్షించేలా వివిధ కళారూపాలు తీర్చిదిద్దారు. విశాఖ బీచ్ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పుష్పాలతో ఏర్పాటు చేసిన తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వివిధ జీవరాశులతో ఆర్కే బీచ్‌ను చక్కగా తీర్చిదిద్దారు.

ప్రధాని మోదీతో పాటు వివిధ ప్రముఖులు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి రానుండటంతో పోలీసులు అణువణువు నిఘా పెట్టారు. 2వేలకు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు. డ్రోన్ల కెమెరాలతో ప్రత్యేక చర్యలు చేపట్టారు. కీలకమైన ప్రాంతాలత్లో ఐదు కిలోమీటర్ల మేర రేడియేషన్‌లో నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు. ఇక ప్రధాని మోదీ యోగాసనాలు వేసే వేదికను SPG సిబ్బంది తమ ఆధినంలోకి తీసుకుంది. వేదిక మొత్తం పటిష్ట భద్రత. ఎక్కడైనా చిన్న ఘటన జరిగిన క్షణాల్లో అలర్ట్ అయ్యేలా పోలీసులు, అధికారులు రెడీ అయ్యారు.

ఇప్పటికే వీవీఐపీలు నగరానికి చేరుకుంటున్నారు. ప్రధాని మోదీ ఇవాళ సాయంత్రం 6.40 గంటలకు వైజాగ్ చేరుకుంటారు. ఇక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కూడా సాయంత్రానికి నగరానికి చేరుకుని ప్రధానికి స్వాగతం పలకనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News