IND vs ENG 1st Test: భారత- ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రతిష్మాత్మకమైన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభమైంది. హెడింగ్లీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచింది. ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్కు దిగనుంది. వర్షం పడే అవకాశాలు ఉండటంతో తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం గిల్ సేనకు సవాల్గా మారనుంది. భారత జట్టులోకి యువ ఆటగాడు సాయి సుదర్శన్ అరంగేట్రం చేశాడు. ఇక సీనియర్ ప్లేయర్ కరుణ్ నాయర్ చాలా సంవత్సరాల తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.
ఇక ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో సత్తా చాటిన తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కలేదు. అతడి స్థానంలో టీమ్ మేనేజ్మెంట్ శార్దూల్ ఠాకూర్ వైపు మొగ్గు చూపింది. భారత బ్యాటింగ్ను కేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్ ప్రారంభించనున్నారు. సాయి సుదర్శన్ మూడో స్థానంలో, కెప్టెన్ శుభ్మన్ గిల్ నాలుగు, వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ ఐదో స్ఠానంలో ఆడనున్నారు. మరోవైపు మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. కఠినమైన బౌన్సీ పిచ్లపై పటిష్టమైన ఇంగ్లాండ్ జట్టును యువ భారత జట్టు ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.
భారత జట్టు: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ
ఇంగ్లాండ్ జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.