Marriage Grooms father and bride:సమాజంలో ప్రస్తుతం పెళ్లి జరిగింది అనగానే అవునా అనే పరిస్థితి నుంచి ఎవరెవరికీ అయ్యింది అనే డౌట్.. ఆ వెంటనే ప్రశ్నలు. పెద్దలు కుదిర్చిన పెళ్లి.. అది కూడా అదే అమ్మాయి, అదే అబ్బాయి అయితే ప్రశాంతం. పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురిలో ఏ ఒక్కరు మారినా అది సంచలనం. ప్రస్తుత కాలంలో ఇలాంటి సంచలనాలే ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. పెళ్లి నిశ్చయం అయ్యాక అబ్బాయి అమ్మాయి తల్లితో ప్రేమలో పడి ఇద్దరూ కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లిచేసుకోవడం, కాబోయే కోడలితో మామ పారివడం వంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఇక నార్త్లో అయితే ఇలాంటి వింత పెళ్లిళ్లు ఈ మధ్య కాలంలో సాధారం అన్నట్లుగా తయ్యారయ్యింది.
తాజాగా ఉత్తరప్రదేశ్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. రాంపూర్లోని ఓ మామ తనకు కాబోయే కోడలిని మనువాడాడు. బన్సనాలి గ్రామంలో నివసిస్తున్న ముగ్గురు పిల్లల తండ్రి తన మైనర్ కొడుకు వివాహాన్ని తొలుత ఒక అమ్మాయితో బలవంతంగా నిశ్చయించాడు. ఆ తర్వాత అదే అమ్మాయితో పారిపోయి ఆమెను వివాహం చేసుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. వివరాల ప్రకారం, బన్సాంగ్లి గ్రామానికి చెందిన షకీల్ అనే వ్యక్తి తన మైనర్ కొడుకు వివాహం సమీపంలోని ఖేంపూర్ గ్రామానికి చెందిన ఒక అమ్మాయితో కుదిర్చాడు. ఈ సంబంధానికి కుటుంబం అభ్యంతరం చెప్పినప్పుడు, షకీల్ తన భార్య, పిల్లలను కొట్టి ఈ సంబంధానికి ఒప్పించాడు. పెళ్లి నిశ్చయమయ్యాక తన భర్త షకీల్ కాబోయే కోడలు ఫోన్లో మాట్లాడుకోవడ ప్రారంభించారు. వీడియో కాల్స్ కూడా చేసుకునే వారు. దీనికి అభ్యంతరం చెప్పినప్పుడు షకీల్ తనపై, పిల్లలపై దాడికి పాల్పడేవాడని భార్య ఆవేదన వ్యక్తం చేసింది.
తన భర్త రూ. 2 లక్షల నగదు, ఒకటిన్నర తులాల బంగారంతో ఇంటి నుంచి పారిపోయాడని షకీల్ భార్య ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తకొడుకుతో వివాహం నిశ్చయించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. తాను ఎక్కడికి వెళ్లాలని, ఏమని న్యాయం కోరుకోవాలని షకీల్ భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తనకు కాబోయే భార్యతో పారిపోయి ఆమెను వివాహం చేసుకుని సమాజంలో తలెత్తుకోకుండా చేశాడని షకీల్ కుమారుడు వాపోతున్నాడు.
ALSO READ:https://teluguprabha.net/telangana-news/congress-leaders-fire-on-konda-murali-comments/
కాగా, ఉత్తర ప్రదేశ్లోని గోండా జిల్లా ఖొడారే పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏప్రిల్ నెలలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. అయితే ఇక్కడ కాబోయే అల్లుడితో అమ్మాయి తల్లి పారిపోయింది. అసలు ఏమైందంటే ఓ గ్రామానికి చెందిన యువతికి బస్తీ జిల్లాకు చెందిన 25 ఏళ్ల యువకుడితో పెళ్లి నిశ్చయించారు. మే 9వ తేదీ వివాహానికి ముహూర్తం పెట్టున్న వీరు మరి కొద్ది రోజుల్లో పెళ్లి ఉండగా కాబోయే అల్లుడితో తరుచుగా ప్రేమయాణం సాగించిన అత్త అతనితో కలిసి వెళ్లిపోయింది. ఈఘటనపై స్టేషన్లో ఇరు కుటుంబాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, కొద్ది రోజుల తరువాత పారిపోయిన అత్త, అల్లుడు స్టేషన్కు వచ్చి తాము ఒకరినొకరు ప్రేమించుకున్నామని, ఇద్దరి ఇష్టంతోనే వెళ్లిపోయామని పోలీసులకు వివరించారు. తాము పెళ్లి చేసుకున్నట్లు అంగీకరించారు.