Thursday, September 19, 2024
HomeతెలంగాణNizampet: మోడల్ కార్పొరేషన్ గా నిజాంపేట్

Nizampet: మోడల్ కార్పొరేషన్ గా నిజాంపేట్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 30వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్  పర్యటించారు. ఈ సందర్భంగా 15వ డివిజన్ రాజీవ్ గాంధీనగర్ పత్తికుంట వద్ద రూ.35 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, చైన్ లింక్ మెష్,17 లక్షలతో భూగర్భ డ్రైనేజీ, 15 లక్షలతో పూర్తి చేసిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఎమ్మెల్యే  స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్,  కమిషనర్ రామకృష్ణ రావు, స్థానిక కార్పొరేటర్ సుజాతతో కలిసి ప్రారంభించారు.

- Advertisement -

కాలనీ వాసులకు ఇబ్బంది లేకుండా డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు వేరొక చోటకు బదిలీ చేసినందుకు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు. అక్కడే ఉన్న 10 ఎకరాల ప్రభుత్వ స్థలంలో పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేని కోరారు. ఈ కార్యక్రమంలో డీఈఈ సుదర్శన్ రావు, వాటర్ వర్క్స్ డిజిఎం మహేష్ మరియు కార్పొరేటర్లు, ఎన్ఎంసీ బిఆర్ఎస్ ప్రెసిడెంట్ రంగరాయ ప్రసాద్, నాయకులు, మైనార్టీ, క్రిస్టియన్ సోదరులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News