Atrocity case Filed on Vijay Deverakonda:రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన వ్యాఖ్యలతో ఎప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. అర్జున్ రెడ్డి సినిమా సమయంలో కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. విజయ్ వ్యాఖ్యలను ప్రముఖ యాంకర్ అనసూయ తీవ్రంగా ఖండించారు. అప్పటి నుంచి ఆయన ఫ్యాన్స్, అనసూయ మధ్య సోషల్ మీడియాలో వార్ జరిగింది. అలాగే లైగర్ సినిమా అప్పుడు కూడా ఈ సినిమా రూ.200 కోట్లు కొట్టడం పక్కా అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ కామెంట్స్ కూడా బాగా ట్రోల్ అయ్యారు.
తాజాగా మరో వివాదంలోనూ చిక్కుకున్నారు. ఇటీవల తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘రెట్రో’ మూవీ ప్రీరిలీజ్ వేడుకల్లో ఆయన చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ వ్యాఖ్యలు ఆదివాసీలను అవమానించేలా ఉన్నాయని పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా నిర్వహించాయి. పలు చోట్లు విజయ్ దేవరకొండపై పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు.
ఈ క్రమంలో గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నేనావత్ అశోక్ కుమార్ నాయక్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.
అసలు ఏం జరిగిందంటే ‘రెట్రో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ జమ్మూకశ్మీర్ లో జరిగిన పహల్గాం ఉగ్ర దాడిని ఖండించారు. ఆ టెర్రరిస్టు కొడుకులకు సరైన ఎడ్యుకేషన్ ఇప్పిస్తే, ఇలా బ్రెయిన్ వాష్ అవ్వకుండా ఉంటారన్నారు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధిలేకుండా, కామన్ సెన్స్ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఆదివాసీలను అవమానించేలా ఉన్నాయని గిరిజన సంఘాలు మండిపడ్డాయి. ఆందోళనలు చేయడంతో గిరిజనులకు విజయ్ దేవరకొండ క్షమాపణలు కూడా చెప్పాడు.
Vijay Deverakonda: విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు నమోదు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES