PAN Card Rules change:పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. అయితే ఈ రెండింటి అనుసంధానం గురించి ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) 2025 జూలై 1 నుండి కొత్త పాన్ కార్డు కోసం ఆధార్ కార్డును లింక్ చేయడం తప్పనిసరి చేసింది. అలాగే ఇప్పటికే పాన్ ఉన్న వారు కూడా ఆధార్ తో అనుసంధానం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ పని అంటే రెండింటినీ లింక్ డిసెంబర్ 31, 2025 నాటికి చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత, ఆధార్ లింక్ లేకుండా పాన్ కార్డ్ యాక్టివ్ గా ఉండదు, అంటే నిష్క్రియంగా ఉంటుంది. ఇది పన్ను, ఇతర ఆర్థిక కార్యకలాపాలలో సమస్యలను కలిగిస్తుంది.
పన్ను వ్యవస్థలో పారదర్శకతను పెంచడం మరియు డిజిటల్ ప్రక్రియలను బలోపేతం చేయడమే ఈ మార్పు లక్ష్యంగా ఉంది. ప్రస్తుతం ఒక వ్యక్తి పాన్ కార్డు పొందడానికి వివిధ గుర్తింపు కార్డులను ఉపయోగించవచ్చు, కానీ ఇప్పుడు ఆధార్ కార్డు లేకుండా దరఖాస్తు అంగీకరించబడదు. పన్ను రిటర్న్లను దాఖలు చేసే ప్రక్రియను సులభతరం చేయడానికి మరియు జవాబుదారీగా చేయడానికి ఈ దశ ఒక ముఖ్యమైనదిగా ఉంది.
మీరు మీ పాన్ కార్డును ఆధార్తో లింక్ చేయాలనుకుంటే, మీరు ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ వెబ్సైట్కి వెళ్లి ‘లింక్ ఆధార్‘ ఎంపికను ఎంచుకోవాలి. దీనిలో మీరు పాన్ నంబర్, ఆధార్ నంబర్ మరియు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను పూరించాలి. చివరగా ఆధార్ ప్రామాణికతను నిర్ధారించడం ద్వారా లింకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది మరియు అది విజయవంతమైతే సందేశం కనిపిస్తుంది.
కొత్త నిబంధన కారణంగా ఆధార్-పాన్ లింక్ను సకాలంలో పూర్తి చేయడం అవశ్యం, తద్వారా ఇబ్బందులను నివారించవచ్చు. 31 డిసెంబర్ 2025 తర్వాత, లింక్ చేయని పాన్ కార్డులు పని చేయవు. ఇది మీ ఆర్థిక మరియు పన్ను విషయాలను ప్రభావితం చేస్తుంది.
ముఖ్యాంశాలు:
కేంద్ర ప్రభుత్వం 2025 జూలై 1 నుండి కొత్త పాన్ దరఖాస్తు చేసుకుంటే గనుక ఆధార్ తప్పనిసరి ఉండాల్సిందే.
ఇప్పటికే ఉన్న పాన్ హోల్డర్లు ఆధార్ లింక్ చేయడానికి చివరి తేదీ మాత్రం 2025 31 డిసెంబర్ వరకు ఉంది.
ఆధార్ లింక్ చేయకపోతే పాన్ డీయాక్టివేట్ అవుతుంది. దీని వల్ల బ్యాంకు, ఆర్థిక లావాదేవీలు చేసుకోవడం సాధ్యం కాదు.
లింక్ చేయడానికి సులభమైన ఆన్లైన్ ప్రక్రియ అందుబాటులో ఉంది.