భారత్తో లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు శుభారంభం చేసింది. ప్రత్యర్థి భారీ లక్ష్యాన్ని ముందుంచినా సునాయసంగా ఛేదించింది. ఐదు టెస్టుల సిరిస్లో భాగంగా తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఓవర్ నైట్ స్కోర్ 21/0తో లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 188 పరుగుల వద్ద జాక్ క్రాలే (65) వికెట్ను కోల్పోయింది. మరో ఓపెనర్ బెన్ డకెట్ మాత్రం ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే కొద్దిసేపటికే ఓల్లి పోప్ (8)ని ఔట్ చేశాడు. ఈ క్రమంలో బెన్ డకెట్ సెంచరీ సాధించి జోరుమీదున్నాడు. మరోవైపు గిల్ బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. అయితే ధాటిగా ఆడే క్రమంలో డకెట్ (149) శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో సబ్స్ట్యూడ్ ఫిల్డర్ నితీష్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం కొద్దిసేపటికే ప్రసిధ్ హారీ బ్రూక్ (0)ని పెవిలియన్కు పంపడంతో భారత్ వైపు మ్యాచ్ తిరిగింది.
ALSO READ: https://teluguprabha.net/telangana-district-news/ias-amrapali-back-to-telangana/
అయితే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్స్టోక్స్ (33) సీనియర్ బ్యాటర్ జో రూట్తో కలిసి దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీకి బాది భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో బౌలింగ్కు వచ్చిన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్టోక్స్ను ఔట్ చేశాడు. అప్పటికే లక్ష్యం చిన్నదిగా ఉండడంతో మిగతా పనిని జో రూట్ (53), స్మిత్ (44) పూర్తిచేసి జట్టుకు విజయాన్ని అందించారు. టీమిండియా బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ రెండేసి వికెట్లు, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లను తీసిన బూమ్రా రెండో ఇన్నింగ్స్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. ఇదిలాఉంటే శుభ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా తొలి టెస్టులోనే పరాజయం పాలవడంతో జట్టు నిరాశకు గురైంది. అయితే ఇంగ్లండ్ వంటి మేటి జట్టుతో హోరాహోరీగా పోరాడడంపై మాజీలతో పాటు క్రికెట్ విశ్లేషకులు గిల్ సారథ్యాన్ని మెచ్చుకోవడం గమనార్హం.
ALSO READ: https://teluguprabha.net/sports-news/team-india-score-five-test-centurys-in-a-match-for-the-first-time-in-test-history/
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఈ క్రమంలో ఐదు సెంచరీలు నమోదు చేశారు. తొలి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్(101), శుభమన్ గిల్(147), రిషభ్ పంత్(134) సెంచరీలు చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ (137), రిషభ్ పంత్(118) సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఓ టెస్టు మ్యాచ్లో భారత్ తరుపున ఐదు సెంచరీలు నమోదు కావడం ఇదే తొలిసారి.