Wednesday, June 25, 2025
HomeAP జిల్లా వార్తలుAp Deputy Cm: పవన్ కల్యాణ్ ఫొటోలు మార్ఫింగ్, ముగ్గురి అరెస్టు

Ap Deputy Cm: పవన్ కల్యాణ్ ఫొటోలు మార్ఫింగ్, ముగ్గురి అరెస్టు

Yogandhra: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ముగ్గురు వ్యక్తులను పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల వైజాగ్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పీఎం మోడీ, సీఎం చంద్రబాబుతో కలిసి పవన్ పాల్గొన్న సంగతి తెలిసిందే. యోగా డేలో పాల్గొన్న పవన్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని జనసేన నాయకులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కోనసీమ జిల్లాకు చెందిన సాయివర్మ, హైదరాబాద్ సరూర్ నగర్‌కు చెందిన షేక్ మహమూబ్, మచిలీపట్నానికి చెందిన రామాంజినేయులను పోలీసులు అరెస్టు చేశారు.


ఏపీ ప్రభుత్వం యోగాంధ్ర పేరిట 11వ అంతర్జాతీయ యోగా డేను ఈనెల 21 ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. విశాఖ సాగర తీరాన నిర్వహించిన ఈ వేడుకలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు, ఇతర రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. సుమారు 3 లక్షల మందికి పైగా ప్రజలు యోగాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఈ యోగాంద్ర కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. యోగా విశిష్టతను మోడీ తెలియజేశారు. ప్రపంచాన్ని యోగా ఏకం చేసిందని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే.

ALSO READ: https://teluguprabha.net/sports-news/ind-vs-eng-1st-test-team-india-create-worest-record-in-tests-history/

యోగా డేలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మోడీపై ప్రశంసలు కురింపించిన సంగతి తెలిసిందే. యోగా ఆమోదానికి 177 దేశాల మద్దతు కూడగట్టిన మోడీ గొప్ప దార్శనికుడు అని కొనియాడారు. రుగ్వేదం యోగా విశిష్టతను చెబితే, దాన్ని విశ్వవ్యాప్తం చేసింది మోడీ అని పవన్ అన్నారు. ఒత్తిడిని జయించేందుకు, మానసిక ప్రశాంతతకు యోగా ఉపయోగపడుతుందన్నారు.

ALSO READ: https://teluguprabha.net/telangana-news/emergency-is-a-symbol-of-congress-leadership/

కాగా, 2024లో జరిగిన ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ ఏర్పాటులో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలకంగా వ్యవహరించారు. నాడు జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 164 అసెంబ్లీ సీట్లు రాగా, వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఏపీ ప్రజలు తీర్పు ఇచ్చారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే, 2024 ఎన్నికల్లో 100 పర్సెంట్ స్ట్రయిక్‌తో జనసేన పోటీచేసిన అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను గెలుపొందింది. పవన్ పిఠాపురం నుంచి భారీ మోజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News