Wednesday, June 25, 2025
Homeచిత్ర ప్రభNTR: ఆ విషయంలో ప్రభాస్‌ను డామినేట్ చేస్తోన్న ఎన్టీఆర్

NTR: ఆ విషయంలో ప్రభాస్‌ను డామినేట్ చేస్తోన్న ఎన్టీఆర్

Prabhas – Prashanth Neel: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు పండగే! ఆయన ప్రస్తుతం ‘డ్రాగన్’ (Dragon) సినిమాతో బిజీగా ఉన్నారు. ఆగస్ట్ 14న ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘వార్ 2’ (War 2) రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. తారక్ ముంబైలో ‘వార్ 2’ ను పూర్తి చేసి, ఆ వెంటనే నీల్ సినిమా వైపు దృష్టి సారించారు. డ్రాగన్ షూట్‌ను స్టార్ట్ చేసి నాన్-స్టాప్‌గా ముందుకు తీసుకెళ్తున్నారు తారక్. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీగా ఉన్నాయి. కెజియఫ్, సలార్ వంటి సెన్సేషనల్ మూవీస్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తోన్న సినిమా కావటం కూడా ఈ అంచనాలు పెరగటానికి కారణాల్లో ఒకటి. ఈ మాస్ కాంబోతో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయటం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

- Advertisement -

ప్రస్తుతం ‘డ్రాగన్’ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతోంది. ప్రశాంత్ నీల్ తనదైన స్టైల్లో లిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా డ్రాగన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేయాలని చిత్ర యూనిట్ చూస్తోంది. అక్కడి నుంచి గ్రాఫిక్స్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులపై టీమ్ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తారక్ అంటేనే మేకోవర్‌లకు పెట్టింది పేరు. ‘టెంపర్’ నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు పదేళ్లుగా ప్రతి సినిమాకూ బరువు పెరగడం, తగ్గడం చేస్తూ వస్తున్నారు. ‘దేవర’ కోసం టైటిల్ రోల్ కోసం బరువు పెరిగిన ఆయన, ఆ తర్వాత ‘వార్ 2’ కోసం సన్నగా మారి, కరెంట్ తీగలా సిక్స్ ప్యాక్ బాడీతో చురకత్తిలా కనిపించారు. తర్వాత త్రివిక్రమ సినిమా కోసం మళ్లీ బరువు పెరగబోతున్నారని టాక్.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/hero-venkatesh-upcoming-movies-line-up/

సాధారణంగా ప్రశాంత్ నీల్ సాధారణంగా తన హీరోలను మరీ పలచగా చూపించరు. విలన్‌ పవర్‌ఫుల్‌గా ఉన్నప్పుడు హీరో లుక్, ఫిజిక్ అంతకు మించేలా కనిపించాలి. ఆయన గత సినిమాలను చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని ‘డ్రాగన్’ కోసం తారక్ మరోసారి బరువు పెరుగుతున్నట్లు సమాచారం. ఈ మేకోవర్ సినిమాకు మరింత హైప్ తీసుకొస్తోంది. దీన్ని కేవలం యాక్షన్ మూవీగానే కాకుండా ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా నేపథ్యం ఉండేలా చూసుకుంటున్నారు నీల్. డైరెక్టర్ తన గత చిత్రాలకి భిన్నంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు.

డ్రాగన్ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఈ ఒక్క సీన్ కోసమే ఏకంగా 70 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది, ఇదిప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మూవీ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా రంగంలోకి దిగారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను జూన్ 25, 2026న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News