Wednesday, June 25, 2025
HomeఆటTeam india: టెస్టుల్లో టీమిండియా చెత్త రికార్డు

Team india: టెస్టుల్లో టీమిండియా చెత్త రికార్డు


Team india worest Record: అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. టాపార్డర్ బ్యాటర్లు అద్బుతంగా ఆడి సెంచరీల మీద సెంచరీలు చేసినా ఓటమి తప్పలేదు. భారీ టార్గెట్ ప్రత్యర్థి ముందు ఉంచినా ఫలితం లేకుండా పోయింది. బౌలర్లు విఫలం కావడం, ఫిల్డింగ్ లో క్యాచ్ లు మిస్ చేయడం టీమిండియా కొంప ముంచాయి. దీంతో పరాజయం తప్పలేదు. భారత ఓటమిపై అభిమానులు, మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్నారు.

ఈ మ్యాచ్ లో ఓటమితో టెస్టు చరిత్రలోనే టీమిండియా చెత్త రికార్డు నమోదుచేసుకుంది. ఓ టెస్టు మ్యాచ్‌లో ఐదు సెంచరీలు చేసి కూడా ఓడిపోయిన తొలి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఆటగాళ్లు యశస్వీ జైస్వాల్(101), శుభ్‌మన్ గిల్ (147), రిషభ్ పంత్ (134) సెంచరీలు చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ (137), రిషభ్ పంత్ (118) శతకాలు బాదారు. ఇలా రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి మొత్తం ఐదు సెంచరీలు నమోదయ్యాయి. అయినా కానీ భారత్ జట్టు విజయం సాధించలేకపోయింది.

ఇంతకుముందు ఈ చెత్త రికార్డు ఆస్ట్రేలియా జట్టు పేరిట ఉండేది. 1928-29లో జరిగిన యాషెస్ సిరీస్ సందర్భంగా ఓ మ్యాచ్ లో ఆ జట్టు ఆటగాళ్లు నాలుగు సెంచరీలు చేశారు. అయినా కానీ ఆసీస్ టీమ్ ఓడిపోయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఐదు సెంచరీలు చేసినా ఓడిపోయిన తొలి జట్టుగా టీమిండియా వరస్డ్ రికార్డు తన ఖాతాలో వేసుకుంది.

371 పరుగుల టార్గెట్ తో నాలుగో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య ఇంగ్లాండ్ బ్యాటర్లు దుమ్మురేపారు. తమకే సాధ్యమైన బజ్ బాల్ ఆటను మరోసారి కొనసాగించారు. ప్రతి బంతిని బౌండరీ పంపించడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేశారు. దీంతో వారి దూకుడు ముందు భారత బౌలర్లు చేతులెత్తేశారు. దూకుడుగా ఆడిన ఇంగ్లాండ్ టీమ్ ఐదు టెస్టుల సిరీస్ లో తొలి టెస్టు గెలిచి శుభారంభం చేసింది. కాగా రెండో టెస్టు జులై 2-6 మధ్య జరగనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News