Mukesh Ambani Jio Risk :రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఒక గేమ్ చేంజర్ అనే విషయం అందరికీ తెలుసు.. ఆయన భారతదేశం కోసం ఎంత పెద్ద రిస్క్ అయినా చేస్తారు. ఇదే విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యోలో చెప్పారు. జియో కంపెనీ ప్రారంభించడం ఇప్పటివరకు తాము తీసుకున్న అతిపెద్ద వ్యాపార రిస్క్ అని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. మెకిన్సీ & కంపెనీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయంలో తాను తీసుకున్న ధైర్యమైన నిర్ణయాల గురించి వివరించారు.
జియో ప్రారంభ సమయంలో భారతదేశం ఇంకా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కు సిద్ధంగా లేదని చాలామంది చెప్పారు. “మేము మా సొంత డబ్బును పెట్టుబడిగా పెట్టాం. ఇది ఆర్థికంగా ఫలించకపోయినా, దేశాన్ని డిజిటలైజ్ చేసిన గొప్ప సేవగా మిగిలిపోతుంది” అని ముఖేష్ అంబానీ అన్నారు. ఇది రిలయన్స్ జియో విజయ గాధ కి ఒక పెద్ద మలుపుగా మారింది.
జియో వల్ల దేశవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో హై స్పీడ్ డేటా అందుబాటులోకి రావడం ద్వారా ఇండియా డిజిటల్ రివల్యూషన్ కి బీజం పడింది.
అంబానీ వివరించిన ప్రకారం, రిలయన్స్ తన కొత్త వ్యాపారాలలో ముందుగానే మౌలిక నిర్మాణాలను అభివృద్ధి చేస్తోంది. “2021లో మేమే స్వయంగా 5G టెక్నాలజీని అభివృద్ధి చేసాం. కోర్ టెక్నాలజీ నుంచి హార్డ్వేర్, సాఫ్ట్వేర్ వరకు 80% మేమే తయారు చేసాం. మిగతా 20% కోసం ఎరిక్సన్, నోకియా సహాయం తీసుకున్నాం,” అని తెలిపారు.
ఇది రిలయన్స్కి కొత్త దారులు తీసుకువచ్చింది. రిలయన్స్ న్యూ ఎనర్జీ విభాగం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా ఎంతగానే అభివృద్ధి చెందుతూ దేశానికి తోడ్పాడునందిస్తోంది. సోలార్ ప్యానల్స్, హైడ్రోజన్ టెక్నాలజీ, బ్యాటరీ స్టోరేజ్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది.
ఈ అభివృద్ధి గురించి మాట్లాడుతూ అంబానీ అన్నారు, “ప్రపంచం ప్రతి 5-10 ఏళ్లకు మారుతుంది. మనం బిజినెస్ స్కూల్లో నేర్చుకున్న ప్రిన్సిపల్స్ని మించి ఆలోచించాలి. టెక్నాలజీ అనేది కొత్త అవకాశాలను తెస్తుంది. వాటిని పట్టుకోవాలంటే ధైర్యం కావాలి” అని ఆయన అన్నారు.
రిలయన్స్ సంస్థను భవిష్యత్ తరాల కోసం అభివృద్ధి చేయాలన్న దృక్కోణాన్ని ఆయన పునరుద్ఘాటించారు. “రిలయన్స్ అనేది ఒక సంస్థ, ఇది నన్ను, నా తండ్రిని మించి ఉండాలి” అని ధీరుభాయ్ అంబానీ చెప్పిన మాటలను గుర్తుచేశారు. జియో ఒక వ్యాపార నిర్ణయం మాత్రమే కాకుండా, భారతదేశ డిజిటలైజేషన్లో కీలక మలుపుగా నిలిచింది. ముఖేష్ అంబానీ తీసుకున్న రిస్క్ ఇప్పుడు దేశానికే దిశ చూపుతోందని చెప్పడం అతిశయోక్తి కాదేమో.