Saturday, October 5, 2024
HomeతెలంగాణPatancheru: భారీ మాలతో గూడెంకు బ్రహ్మరథం

Patancheru: భారీ మాలతో గూడెంకు బ్రహ్మరథం

దేశంలోని విభిన్న సంస్కృతులకు నిలయం పటాన్చెరు నియోజకవర్గమని, అన్ని వర్గాల ప్రజలను కంటికి రెప్పల కాపాడుకుంటున్నామని పటాన్చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామంలోని దుర్గా నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన  దుర్గా నగర్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా  కాలనీ వాసులు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం పటాన్చెరు నియోజకవర్గంలో అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సునీత సత్యనారాయణ, ఉప సర్పంచ్, దుర్గా నగర్ కాలనీ అధ్యక్షులు ఎం డి ఫహిం, అమీన్ పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ తులసి రెడ్డి, రాజు, యూనిస్, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News